BREAKING
'ఇరుముడి' సినిమాలోని ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలి 50 ఏళ్లలో ఇలాంటి విజయం చూడలేదు: ‘ఇరుముడి’ సక్సెస్‌పై రవితేజ ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం మెదక్ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారడం ఖాయం జిల్లా పోలీస్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం రికార్డు స్థాయిల్లో బంగారం, వెండి ధరలు కేపీహెచ్‌బీలో విషాదం.. అపార్ట్‌మెంట్‌పై నుంచి మహిళ మృతి వైమానిక సర్వే నిర్వహించిన డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి యశస్వి జైస్వాల్, అసిథా ఫెర్నాండోలకు మ్యాచ్ ఫీజులో కోత రూ. 1.1 కోట్లకు పైగా నగదు సీజ్ చేసిన ఈడీ భారత్-రష్యా సంబంధాల వృద్ధికి ప్రధాని మోదీనే కారణం చార్మినార్ అందాలకు ముగ్ధుడైన అమెరికా రాయబారి సెర్గియో గోర్ గుజరాత్‌లో నిరంతర అత్యవసర సేవలు 2030 నాటికి $100 బిలియన్ల ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యం ఛత్తీస్‌గఢ్‌లో భారీగా నక్సల్స్ ఆయుధాలు స్వాధీనం

ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం

మేడ్చల్ మ‌ల్కాజిగిరి: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించడమే జిల్లా అధికార యంత్రాంగం యొక్క ప్రధాన లక్ష్యమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విజయేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయం (ఐడివోసీ) సమావేశ మందిరంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రజల నుండి స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నామని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం ప్రదర్శించవద్దని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుండి మొత్తం 75 దరఖాస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్‌వో) మాలతితో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.