చైనా అధ్యక్షుడి భారత్ పర్యటనపై కీలక కసరత్తు.. అజిత్ డోవల్ భేటీతో పెరిగిన ఆసక్తి
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్ పర్యటనకు అవకాశాలు కనిపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జిన్పింగ్ భారత్కు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ పర్యటన ఖరారైతే దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన భారత్లో అడుగుపెట్టనున్నారు.
మరోవైపు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ బీజింగ్ చేరుకున్నారు. భారత్-చైనా సరిహద్దు సమస్యలపై జరిగే ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. చైనా విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు వాంగ్ యీతోనూ డోవల్ భేటీ కానున్నారు.
జిన్పింగ్ భారత్ పర్యటనకు ముందు డోవల్ బీజింగ్ పర్యటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దు వివాదం, ద్వైపాక్షిక సంబంధాలు, ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.