BREAKING
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లు.. 648 సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం! జైలు నుంచి వీడియో కాల్ ఎలా? మహిళా అధికారిపై వైరల్ వీడియో దుమారం! 'తెహెల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్ మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పార్టీ లైన్ దాటితే రేవంత్ రెడ్డిని అయినా ఉపేక్షించం సిట్టింగ్ జడ్జితో విచారణకు హరీష్ రావు డిమాండ్ దేవాదుల ఎత్తిపోతల పథకంపై నేడు మంత్రి ఉత్తమ్ సమీక్ష కర్నూలులో ఖాకీల ఇళ్లలోనే కాలా నైట్ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఒకే ఘటనతో పలు కేసులు.. భయపడేది లేదు: అంబటి రాంబాబు క్యూఆర్ పరిధిలో నేడే 'ఇందిరమ్మ ఇళ్ల' అర్హుల తుది జాబితా విడుదల గచ్చిబౌలిలో ప్రమాదకర భవనాల కూల్చివేత ఏపీలో ఇన్‌సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ స్నాప్ చాట్ లో పరిచయం ఆమెకు జరిగింది ఆర్ధిక మోసం శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

పార్టీ లైన్ దాటితే రేవంత్ రెడ్డిని అయినా ఉపేక్షించం

Select Suryaa Now
పార్టీ లైన్ దాటితే రేవంత్ రెడ్డిని అయినా ఉపేక్షించం

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, అయితే క్రమశిక్షణ తప్పి హద్దులు దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ నిబంధనలు, లైన్ అందరికీ సమానమేనని ఆయన స్పష్టం చేశారు.

"పార్టీ లైన్ దాటితే ఎవరినీ వదిలిపెట్టేది లేదు. ఇది నాతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు మంత్రివర్గంలోని అందరూ మంత్రులకు సమానంగా వర్తిస్తుంది." కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభిప్రాయ స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని అందిస్తుందని, అయితే దానిని లక్ష్మణరేఖ దాటి దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.

పార్టీ ఇమేజ్‌కు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుందని, అందరూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు.