BREAKING
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లు.. 648 సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం! జైలు నుంచి వీడియో కాల్ ఎలా? మహిళా అధికారిపై వైరల్ వీడియో దుమారం! 'తెహెల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్ మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పార్టీ లైన్ దాటితే రేవంత్ రెడ్డిని అయినా ఉపేక్షించం సిట్టింగ్ జడ్జితో విచారణకు హరీష్ రావు డిమాండ్ దేవాదుల ఎత్తిపోతల పథకంపై నేడు మంత్రి ఉత్తమ్ సమీక్ష కర్నూలులో ఖాకీల ఇళ్లలోనే కాలా నైట్ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఒకే ఘటనతో పలు కేసులు.. భయపడేది లేదు: అంబటి రాంబాబు క్యూఆర్ పరిధిలో నేడే 'ఇందిరమ్మ ఇళ్ల' అర్హుల తుది జాబితా విడుదల గచ్చిబౌలిలో ప్రమాదకర భవనాల కూల్చివేత ఏపీలో ఇన్‌సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ స్నాప్ చాట్ లో పరిచయం ఆమెకు జరిగింది ఆర్ధిక మోసం శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

Select Suryaa Now
మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

13 మంది విద్యార్థులకు అస్వస్థత
ఖమ్మం: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అస్వస్థత ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లా వేంనూరు మండలం మర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) తిన్న 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

పాఠశాలలో అందించిన అల్పాహారం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు, సిబ్బంది వెంటనే స్పందించి అస్వస్థతకు గురైన 13 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలను సందర్శించి అల్పాహారం శాంపిళ్లను సేకరించి విచారణ చేపట్టారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.