వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు..
సూర్య వేములవాడ రురల్:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం నుంచి సుమారు 8:50 వరకు 1,05,600 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ ప్రజాసంబంధాల అధికారి (పీఆర్ఓ) శ్రీనివాస్ తెలిపారు.స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.భీమన్న సన్నిధిలో వివిధ అర్జిత సేవలు, అభిషేకాలు, కళ్యాణోత్సవాలు ప్రత్యేక పూజల ద్వారా (హుండీ ఆదాయం మినహాయించి) ఒక్కరోజులో రూ.52,22,473/- ఆదాయంశ్రావణ మాసంలో ఒక్కరోజులో నమోదైన ఆదాయాలలో ఇది అత్యధిక ఆదాయం దేవాలయ చరిత్రలో హుండీ ఆదాయం మినహాయించి ఒక్కరోజులో నమోదైన ఆదాయాలలో ఇది రెండవ అత్యధిక ఆదాయంగా నిలిచింది .
చివరి శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ విశేషంగా నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు నిర్వహించిన వివిధ అర్జిత సేవలు, అభిషేకాలు, కళ్యాణోత్సవాలు మరియు ఇతర ప్రత్యేక పూజల ద్వారా (హుండీ ఆదాయం మినహాయించి) ఒక్కరోజులో రూ.52,22,473/- ఆదాయం సమకూరింది.శ్రావణ మాసంలో ఒక్కరోజులో నమోదైన ఆదాయాలలో ఇది అత్యధిక ఆదాయం కాగా, దేవాలయ చరిత్రలో హుండీ ఆదాయం మినహాయించి ఒక్కరోజులో నమోదైన ఆదాయాలలో ఇది రెండవ అత్యధిక ఆదాయంగా నిలిచింది.శ్రావణ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అర్జిత సేవలు నిర్వహించారు. భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసం, శ్రావణ మాస మహిమ ఫలితంగా ఈ విశేష ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.ఈ వివరాలను ఆలయ పీఆర్వో (PRO) శ్రీ పెరిక శ్రీనివాస్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.