రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్
అవును… అతని చావు కోరుకుంటున్నాం -
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు
రంగారెడ్డి/షాద్ నగర్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 08) : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేము కేసీఆర్ చావు కోరుకుంటున్నాము" అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ అని, ఆయన చనిపోవాలని తాము కోరుకుంటున్నట్లు మాట్లాడారు. కేసీఆర్ నివాసం వద్ద నిరసనలు తెలుపుతామని, ఇంకా అవసరమైతే అక్కడికి వెళ్లి చావు డప్పు కొడతామని హెచ్చరించారు. కేసీఆర్ తన పాలనలో దళితులను తీవ్రంగా మోసం చేశారని ఆయన ఆరోపించారు.