telanagana
“క్షమాపణ చెప్తారనుకున్నా.. డైవర్షన్ చేస్తున్నారు”
సభలో నిన్న జరిగిన ఘటనపై హరీష్రావు క్షమాపణ చెబుతారని భావించామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సభ నడవాలన్నదే తన ఆలోచన అని తెలిపారు. హరీష్కు మైక్ ఇచ్చినప్పుడు క్షమాపణ చెబుతారని అనుకున్నానని, కానీ ఆయన అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తనకు కోపం వస్తోందని స్పీకర్ వ్యాఖ్యానించారు.