BREAKING
హిందూ సమాజానికి కులతత్వం, అంటరానితనం మచ్చ: సామాజిక సామరస్యానికి పిలుపు జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యం ఘనంగా యోగా కార్యక్రమం.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మహిళా షూటర్లకు ప్రధాని మోదీ ప్రశంసలు: దేశానికి గర్వకారణమంటూ అభినందనలు ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్ మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు అప్రమత్తం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణకు వర్ష సూచన రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు మేయర్ స్థానం దళితులకు కేటాయించాల్సిందే కేజీబీవీ ఘటనలో బాధ్యులను గుర్తిస్తాం: గంటా నేడు ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శంకుస్థాపన బిజెపి తీర్థం పుచ్చుకున్న కొవ్వాడ మాజీ ఎంపీపీ గోపాలకృష్ణమూర్తి రాజు తెలుగు గజల్ గాన విభావరి ఆక్స్‌ఫర్డ్ టెడ్ ఎక్స్ వేదికపై అదరగొట్టిన గంటా మనవడు: 9 ఏళ్ల జిష్ణు ఆర్యన్ స్ఫూర్తిదాయక ప్రసంగం ఘనంగా 89వ గోతురుత్ బోట్ రేస్: పురాతన సంప్రదాయాన్ని గుర్తుచేసుకున్న కేరళ సీఎం వి.డి. సతీశన్

నేడు ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శంకుస్థాపన

Select Suryaa Now
నేడు ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శంకుస్థాపన

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: అన్ని ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ ప్రాజెక్టుల కింద ఎంపికైన లబ్ధిదారులకు సంబంధించిన అలాట్‌మెంట్ లెటర్లు రేపటి నుండి జారీ చేయబడతాయి. ఎంపికైన లబ్ధిదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ వాట్సాప్ ద్వారా అలాట్‌మెంట్ లెటర్లు నేరుగా పంపించబడతాయి. అదేవిధంగా, లబ్ధిదారులు తమ అలాట్‌మెంట్ లెటర్లను పొందేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచబడతాయి. కాబట్టి ఎంపికైన లబ్ధిదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లతో పాటు టీజీ హెచ్ బి  వెబ్‌సైట్‌ను కూడా పరిశీలించవలసిందిగా కోరారు. ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తులు  లాటరీ ఎంపికలకు సంబంధించిన ఆన్‌లైన్ సదుపాయాలు ఇప్పటికే టీజీ హెచ్ బి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని రాయదుర్గంలో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు గౌరవ రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  శంకుస్థాపన చేయనున్నారు. రాయదుర్గంలో మల్కం చెరువు వెనుక భాగంలో ఉన్న సుమారు 2.85 ఎకరాల ప్రభుత్వ/తెలంగాణ హౌసింగ్ బోర్డు భూమిలో, ఒక్కొక్కటి సుమారు 528 చ.అ. విస్తీర్ణంతో 480 ఫ్లాట్లు నిర్మించడానికి ప్రతిపాదించబడింది. ప్రతి అర్హత కలిగిన లబ్ధిదారు కేవలం రూ.6.00 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వం ఒక్కో ఫ్లాట్‌కు రూ.5.00 లక్షల సబ్సిడీ అందించడంతో పాటు భూమి మొత్తం వ్యయాన్ని కూడా భరిస్తోంది. రాయదుర్గం–నాలెడ్జ్ సిటీ ప్రాంతం హైదరాబాద్‌లో అత్యధిక స్థిరాస్తి విలువలు నమోదవుతున్న ప్రముఖ ప్రాంతాల్లో ఒకటి. ఆగస్టు 2026లో జరిగిన టీజీఐసీ ఈ-వేలాల్లో, సమీపంలోని 5.25 ఎకరాలు 5.38 ఎకరాల భూములు ఎకరానికి వరుసగా రూ.264 కోట్లు మరియు రూ.269 కోట్లు చొప్పున, మొత్తం సుమారు రూ.1,386 కోట్లు మరియు రూ.1,447 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ ధరలను కేవలం సూచనాత్మక మార్కెట్ ప్రమాణంగా పరిగణిస్తే, ఇందిరమ్మ ఇండ్లు ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్న 2.85 ఎకరాల భూమి విలువ సుమారు రూ.752 కోట్ల నుంచి రూ.767 కోట్ల వరకు ఉంటుంది.
ఇంత విలువైన ప్రధాన ప్రాంతంలో, సాధారణ మార్కెట్‌లో సమానమైన ఫ్లాట్ విలువ సుమారు రూ.50 లక్షలు ఉండే పరిస్థితిలో కూడా, ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి కేవలం రూ.6.00 లక్షల లబ్ధిదారు వాటాతో, అదనంగా రూ.5.00 లక్షల ప్రభుత్వ సబ్సిడీ మరియు ఉచిత భూమితో ఇందిరమ్మ ఇండ్లు ఫ్లాట్‌ను అందిస్తోంది. తద్వారా ప్రధాన ఉపాధి కేంద్రాలు మరియు నగర మౌలిక సదుపాయాలకు సమీపంలో సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో గృహ సదుపాయం కల్పిస్తోంది. రాయదుర్గంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులు అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన సంబంధిత అలాటీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్నం 3.30 గంటలకు కార్యక్రమ స్థలానికి చేరుకొని, పెద్ద సంఖ్యలో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ కోరారు.