BREAKING
హిందూ సమాజానికి కులతత్వం, అంటరానితనం మచ్చ: సామాజిక సామరస్యానికి పిలుపు జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యం ఘనంగా యోగా కార్యక్రమం.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మహిళా షూటర్లకు ప్రధాని మోదీ ప్రశంసలు: దేశానికి గర్వకారణమంటూ అభినందనలు ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్ మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు అప్రమత్తం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణకు వర్ష సూచన రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు మేయర్ స్థానం దళితులకు కేటాయించాల్సిందే కేజీబీవీ ఘటనలో బాధ్యులను గుర్తిస్తాం: గంటా నేడు ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శంకుస్థాపన బిజెపి తీర్థం పుచ్చుకున్న కొవ్వాడ మాజీ ఎంపీపీ గోపాలకృష్ణమూర్తి రాజు తెలుగు గజల్ గాన విభావరి ఆక్స్‌ఫర్డ్ టెడ్ ఎక్స్ వేదికపై అదరగొట్టిన గంటా మనవడు: 9 ఏళ్ల జిష్ణు ఆర్యన్ స్ఫూర్తిదాయక ప్రసంగం ఘనంగా 89వ గోతురుత్ బోట్ రేస్: పురాతన సంప్రదాయాన్ని గుర్తుచేసుకున్న కేరళ సీఎం వి.డి. సతీశన్

కేజీబీవీ ఘటనలో బాధ్యులను గుర్తిస్తాం: గంటా

Select Suryaa Now
కేజీబీవీ ఘటనలో బాధ్యులను గుర్తిస్తాం: గంటా

సూర్య కథనానికి స్పందన

 

భీమిలి, సెప్టెంబర్ 20, మేజర్ న్యూస్:

కేజీబీవీ హైస్కూల్ లో నిద్రపోతున్న విద్యార్ధినుల జుట్టు కత్తిరించిన ఘటనలో బాధ్యులని గుర్తిస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం కేజీబీవీని సందర్శించిన ఆయన సంఘటన గురించి పాఠశాల విద్యార్ధినులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆరా తీశారు. పగడ్బందీ భద్రత ఉన్నందున బయట నుంచి ఎవరూ వచ్చే అవకాశం లేదని.. పాఠశాలలో ఉన్న వారే ఈ చర్యకు పాల్పడి  ఉంటారనే ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. 4 రోజుల క్రితం చోటు చేసుకున్న విషయానికి ఇప్పుడు విస్తృత ప్రచారం కల్పించడం వెనుక ఎవరైనా ఉన్నారా అనే అంశాన్ని విచారిస్తున్నారు. సునిశితమైన విషయం కావడంతో విద్యార్థినులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిష్టాకరమైన విద్యా సంస్థలో ఇలాంటి సంఘటనలు సహించబోమని.. పాఠశాల విద్యార్థినులతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. పిల్లలు ఆకతాయితనంగా చేశారా లేదా వేరే బలమైన కారణముందా అనేది విచారణలో తేలుతుందని తెలిపారు. కారకులు ఎవరు అనేది స్వచ్ఛందంగా చెబితే సమస్య కొలిక్కి వస్తుందని లేనిపక్షంలో సీసీ కెమెరాలు, వేలి ముద్రలు వంటి సాక్ష్యాల ఆధారంగా బాధ్యులని గుర్తిస్తామన్నారు. ఏపీసీ చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ గంగాభవాని, సీఐ దివాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.