బిజెపి తీర్థం పుచ్చుకున్న కొవ్వాడ మాజీ ఎంపీపీ గోపాలకృష్ణమూర్తి రాజు
పద్మనాభం,సెప్టెంబర్ 20,మేజర్ న్యూస్:
పద్మనాభo మండలం మాజీ ఎంపీపీ దంతులూరి గోపాలకృష్ణమూర్తి రాజు, రేవిడి మాజీ సర్పంచి తోగురోతు రమణ, బోని దేముడు బాబు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పరుశురామరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ చేతుల మీదగా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు నాగమణి భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీ కైలాస్ రెడ్డి పద్నాభం బిజెపి మండల ఇన్చార్జి రూపాకుల రవికుమార్ జిల్లా జనరల్ సెక్రెటరీ దానేష్ , మండల ఉపాధ్యక్షులు పాలూరు కృష్ణారావు, మచ్చ సోమేష్, కిసాన్ మోర్చా విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డిపల్లి శ్రీనివాసరావు, సిరిపురపు వెంకట్రావు మరియు ఇతర పెద్దలందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు.