BREAKING
దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్ డబ్ల్యూఏపీఎల్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్‌కు రెండో విజయం అనధికార బాణాసంచా తయారీపై ఉక్కుపాదం. ఈ నెల 21న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి కార్యకర్త గెలిపే లక్ష్యంగా పని చెయ్యాలి చారిత్రక క్లాక్ టవర్లు, ఢిల్లీ 900 స్లేవ్స్ వెనుక ఉన్న రహస్యాలు: భారత కాల రక్షకులపై ఆసక్తికర పుస్తకం అర్చకుడి కుటుంబానికి రూ.1.08 లక్షల ఆర్థిక సాయం అంతర్జాతీయ వేదికపై ఢిల్లీ మెట్రో సత్తా: బెర్లిన్ ఇన్నోట్రాన్స్ 2026 ప్రదర్శనలో డీఎంఐఎల్ అరంగేట్రం ప్రజల కోసం పనిచేసే ప్రజానేత ఇరిగినేని 2028-29 నాటికి పట్టు ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడి ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి చూసే టీడీపీలోకి వచ్చాం హమీద్ అన్సారీ, రాహుల్ గాంధీలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి బీఆర్‌ఎస్‌ హయాంలో అన్యాయం చేశారు : ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

బీఆర్‌ఎస్‌ హయాంలో అన్యాయం చేశారు : ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

Select Suryaa Now
బీఆర్‌ఎస్‌ హయాంలో అన్యాయం చేశారు : ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

             తెలంగాణ బ్యూరో ప్రతినిధి: బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో హరీశ్‌రావు హైదరాబాద్‌ చుట్టూ ఫామ్‌హౌస్‌లు, గచ్చిబౌలిలో విల్లాలు, సిద్దిపేటలో భూములు సమకూర్చుకున్నారని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వంపై, రైతుల సమస్యలపై హరీశ్‌రావు చేస్తున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణలోనూ వర్షాల కొరత ప్రభావం కనిపిస్తోందని ఐలయ్య పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గడంతో విద్యుత్‌ ఉత్పత్తిలో ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బంది కలగకుండా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కరువు పరిస్థితులు లేకపోయినా రైతులకు 12 గంటల విద్యుత్‌ సరఫరా చేయలేదని ఐలయ్య ఆరోపించారు. అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సబ్‌స్టేషన్‌కు వెళ్లి లాగ్‌బుక్‌ను పరిశీలించి విద్యుత్‌ సరఫరాపై వాస్తవాలను బయటపెట్టారని చెప్పారు.
కష్టకాలంలో రైతులకు అండగా నిలవాల్సిన హరీశ్‌రావు, కేటీఆర్‌ రాజకీయ విమర్శలకు పరిమితం కాకుండా రైతులకు ధైర్యం కల్పించాలని సూచించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించిన ఆయన, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని అన్నారు.
“ఏ మొహం పెట్టుకుని హరీశ్‌రావు ఆలేరుకు వచ్చారు? బీఆర్‌ఎస్‌ హయాంలో ఆలేరుకు అన్ని విధాలా అన్యాయం చేశారు” అని బీర్ల ఐలయ్య విమర్శించారు.