BREAKING
దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్ డబ్ల్యూఏపీఎల్‌లో అమరావతి ఈ ఛాంపియన్స్‌కు రెండో విజయం అనధికార బాణాసంచా తయారీపై ఉక్కుపాదం. ఈ నెల 21న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి కార్యకర్త గెలిపే లక్ష్యంగా పని చెయ్యాలి చారిత్రక క్లాక్ టవర్లు, ఢిల్లీ 900 స్లేవ్స్ వెనుక ఉన్న రహస్యాలు: భారత కాల రక్షకులపై ఆసక్తికర పుస్తకం అర్చకుడి కుటుంబానికి రూ.1.08 లక్షల ఆర్థిక సాయం అంతర్జాతీయ వేదికపై ఢిల్లీ మెట్రో సత్తా: బెర్లిన్ ఇన్నోట్రాన్స్ 2026 ప్రదర్శనలో డీఎంఐఎల్ అరంగేట్రం ప్రజల కోసం పనిచేసే ప్రజానేత ఇరిగినేని 2028-29 నాటికి పట్టు ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడి ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి చూసే టీడీపీలోకి వచ్చాం హమీద్ అన్సారీ, రాహుల్ గాంధీలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం రష్యాలో పార్లమెంటరీ ఎన్నికల వేళ మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి బీఆర్‌ఎస్‌ హయాంలో అన్యాయం చేశారు : ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి చూసే టీడీపీలోకి వచ్చాం

Select Suryaa Now
ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి చూసే టీడీపీలోకి వచ్చాం

ఎమ్మెల్యే ఉగ్ర అభివృద్ధి చూసే టిడిపిలోకి వచ్చాం

- పామూరులో అఖండ మెజార్టీతో టీడీపీని గెలిపించి ఎమ్మెల్యే ఉగ్రకు కానుకగా ఇస్తాం
- యాదాల వెంకట సాయి కిరణ్
పామూరు, మేజర్ న్యూస్ : కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసే తాను, తనతో పాటు వైసీపీకి చెందిన 100 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు పామూరు మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ యాదాల వెంకట సాయి కిరణ్ తెలిపారు. వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సారధ్యంలో  పార్టీలో చేరిన అనంతరం యాదాల వెంకట సాయి కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. పామూరు పట్టణంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, నెల్లూరు రోడ్డు డబుల్ రోడ్డు సిమెంట్ రోడ్డుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై దూరదృష్టితో ముందుకు సాగుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో పామూరు మేజర్ పంచాయతీలో టీడీపీకి అఖండ మెజార్టీ సాధించి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి కానుకగా ఇచ్చేందుకు కృషి చేస్తానని యాదాల వెంకట సాయి కిరణ్ స్పష్టం చేశారు.