డబ్ల్యూఏపీఎల్లో అమరావతి ఈ ఛాంపియన్స్కు రెండో విజయం
మంగళగిరి, సెప్టెంబరు 20, మేజర్ న్యూస్ : మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాయలసీమ జెన్ స్టార్స్తో జరిగిన మ్యాచ్లో అమరావతి 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన రాయలసీమ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్కు దిగిన అమరావతి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ రంగ లక్ష్మి 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేయగా, అనూష 41 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 46 పరుగులు చేసింది. వన్డౌన్గా వచ్చిన కాట్రగడ్డ దీక్ష కేవలం 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచింది. ఈ ప్రదర్శనకు ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ జెన్ స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులకే పరిమితమైంది. గ్రీష్మ 39, శుభశ్రీ 22 పరుగులు చేశారు. అమరావతి బౌలర్లలో సాయి పూజిత 4 వికెట్లు, కాండ్రేగుల దేవిక 2 వికెట్లు పడగొట్టగా, సాయి దీప్తి, జోషి చెరో వికెట్ తీశారు. దీంతో అమరావతి 7 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో రెండో గెలుపును నమోదు చేసింది.