BREAKING
యువకుడి పై దాడి.... తీవ్ర గాయాలు ముంబై హాజీ అలీ కోస్టల్ రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం.. బీఎండబ్ల్యూ కారు ఢీకొని ముగ్గురు మృతి సూర్య కథనానికి స్పందన ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే ఏపీ విద్యావ్యవస్థ దేశంలోనే నెం.1 చైత్ర తర్వాత వినాయకుడేనా? బిగ్‌బాస్ హౌస్ నుండి ‘వినాయకుడు’ కృష్ణుడి ఎలిమినేషన్ నిజమేనా! చిరంజీవి కొత్త బిజినెస్.. ఏషియన్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న మెగాస్టార్! ఆసియా క్రీడల్లో భారత్ బోణీ వెండి ధరలు నేడు ఎలా ఉన్నాయంటే.. తెలంగాణ, ఏపీలో తాజా రేట్లు ఇవే ఎంఎంఏ సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత ఫైటర్ నేడు బంగారం ధరలు ఎంతంటే.. తెలంగాణ, ఏపీలో తాజా రేట్లు ఇవే అన్యక్రాంతమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఆఫీసు స్థలం ప్రభుత్వ కీలక పథకాలతో నిరుద్యోగ రేటు 3.2 శాతానికి తగ్గింది మధ్యప్రదేశ్‌లో నది ప్రమాదం ప్రపంచ ఉగ్రవాది మసూద్ అజార్ కోసం పాకిస్తాన్ బూటకపు వేట ఇండోనేషియా ‘బెర్ముడా ట్రయాంగిల్’లో ఫెర్రీ ప్రమాదం

ఎంఎంఏ సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత ఫైటర్

Select Suryaa Now
ఎంఎంఏ సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత ఫైటర్

ఆసియా క్రీడల్లో పతకం ఖాయం చేసిన సుచికా తరియాల్
నగోయా: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఆదివారం నగోయా వేదికగా జరిగిన మహిళల సాంప్రదాయ 60 కేజీల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) విభాగంలో సుచికా తరియాల్ సెమీఫైనల్‌కు చేరుకుని భారత్‌కు తొలి పతకాన్ని ఖాయం చేశారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మంగోలియాకు చెందిన అల్తాన్‌చిమెగ్ బైగల్మాపై సుచికా అద్భుత విజయాన్ని సాధించి 'టాప్ 4'లో అడుగుపెట్టారు.

రెండో రౌండ్‌లో మంగోలియన్ ఫైటర్ బైగల్మా తీవ్ర దూకుడు కనబరిచినప్పటికీ, సుచికా తన డిఫెన్స్‌ను దృఢంగా కాపాడుకున్నారు. ప్రత్యర్థి ఒత్తిడిని సమర్థవంతంగా తిప్పికొడుతూ, సరైన సమయంలో రివర్సల్ ఎత్తుగడతో బైగల్మాను కిందకు పడేశారు. రౌండ్ ముగిసే వరకు తన పట్టును నిలుపుకోవడంతో సుచికా విజయం తథ్యమైంది.

మరోవైపు, భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు కూడా శుభారంభం చేసింది. గ్రూప్ F మ్యాచ్‌లో ఇండోనేషియాను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తొలి మ్యాచ్‌లో శ్రీజ అకుల 3-1తో ఎన్. మహారాణిపై విజయం సాధించి శుభారంభం ఇవ్వగా, అనంతరం దియా చితాలే 3-0తో ఎ. నెబుచాడ్నెజర్‌ను, యశస్విని ఘోర్పడే 3-0తో సి. రస్మిని ఓడించి భారత్‌కు ఘన విజయాన్ని అందించారు. అయితే టెక్‌బాల్ (Teqball) కాంస్య పతక పోరులో వియత్నాం చేతిలో 0-2 (12-9, 12-6) తేడాతో ఓటమి పాలవ్వడంతో భారత ప్రస్థానం పతకం లేకుండానే ముగిసింది.