సూర్య కథనానికి స్పందన
సూర్యకు స్పందన.. కాంగ్రెస్ కార్యాలయ స్థలంపై ఆరా
తాండూరు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 20):
తాండూరు పట్టణంలోని అధికార కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సూర్య దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ స్పందించారు.సూర్య దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని పరిశీలించిన జిల్లా అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్, పత్రికను తెప్పించుకుని వార్తలో పేర్కొన్న అంశాలను నిశితంగా పరిశీలించారు. కార్యాలయ స్థలానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఆయన ఆరా తీసినట్లు సమాచారం.ప్రజా సమస్యలు, ప్రభుత్వ భూములు, రాజకీయ పార్టీల కార్యాలయాలకు సంబంధించిన అంశాలను వెలుగులోకి తీసుకురావడంలో సూర్య దినపత్రిక తనదైన శైలిలో ముందుకు సాగుతోందని స్థానికులు పేర్కొన్నారు. సూర్యలో వచ్చిన కథనంపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు స్పందించి వివరాలు తెలుసుకుంటున్న దృశ్యం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.