BREAKING
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బిఆర్ఎస్ పై కాంగ్రెస్ టార్గెట్ నితిన్, మురళీకాంత్ కాంబినేషన్ ‘అలియాస్ రుక్మిణీ’ ప్యాకప్: పది రోజుల తొలి షెడ్యూల్ పూర్తి ‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్ నెక్స్ట్ లెవెల్: విశేషాలు వెల్లడించిన ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ బన్నీ వాస్, సుకుమార్ల 'ఇడుపు కాయితం' నుంచి 'శ్రీలత..' పాటకు విశేష స్పందన: హర్షం వ్యక్తం చేసిన సురేష్ బొబ్బిలి, అలరాజు మండాడి’ చిత్రానికి విచిత్ర ఆదరణ: గ్రాండ్‌గా విజయోత్సవ వేడుక నిర్వహించిన చిత్రబృందం మహేంద్రగిరి వారాహి’కి లభిస్తున్న ఆదరణపై హర్షం: థ్యాంక్స్ మీట్‌లో హీరో సుమంత్, చిత్రబృందం సెప్టెంబర్ 18న ‘సీక్రెట్ సోల్జర్’ విడుదల: ప్రమోషన్లలో ముచ్చటించిన కథానాయకులు నిహాల్, సూర్య శ్రీనివాస్ మధుయాష్కిని కలిసిన ఏఐపీసీ తెలంగాణ ప్రతినిధులు ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంపై చర్చ బ్రిక్స్ సదస్సులో నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్ భేటీ: సరిహద్దు, ద్విపాక్షిక సంబంధాలపై సుదీర్ఘ చర్చలు పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సంక్షేమానికి కీలకం – విద్యతో పాటు క్రీడలు, క్రమశిక్షణకు ప్రాధాన్యం – మాదకద్రవ్యాలకు దూరంగా.. బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం డీజీపీ సి.వి. ఆనంద్‌ వెల్లడి విద్యా విజయాలకు మార్గదర్శి.. కదిరి బాబు రంగారావు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై కీలక ప్రకటన! కూటమి అక్రమాలకు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం న్యూఢిల్లీ ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించిన బ్రిక్స్ కూటమి 'విశేషాధికారాల పిరమిడ్' స్థానంలో 'భాగస్వామ్య వేదిక' రావాలి

మధుయాష్కిని కలిసిన ఏఐపీసీ తెలంగాణ ప్రతినిధులు ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంపై చర్చ

Select Suryaa Now
మధుయాష్కిని కలిసిన ఏఐపీసీ తెలంగాణ ప్రతినిధులు ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంపై చర్చ


తెలంగాణ బ్యూరో ప్రతినిధి

: ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కి గౌడ్‌ను ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు శనివారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో ఏఐపీసీని మరింత బలోపేతం చేయడం, వివిధ రంగాలకు చెందిన వృత్తి నిపుణులు, మేధావులను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేసే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన ప్రొఫెషనల్స్‌ను ఏఐపీసీ వేదికపైకి తీసుకువచ్చి, వారి సూచనలు, ఆలోచనలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని మధుయాష్కి గౌడ్ సూచించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతాన్ని అడ్డుపెట్టుకుని విభజన రాజకీయాలకు పాల్పడుతోందని పేర్కొంటూ, వాటిని ఎదుర్కొనేందుకు మేధావులు, వృత్తి నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన సూచించినట్లు ప్రతినిధులు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక సమైక్యతను కాపాడే దిశగా ఏఐపీసీ చురుకైన పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు ఇటిక్యాల పురుషోత్తం, ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జి. ఆదిత్య రెడ్డి, ప్రతినిధులు డాక్టర్ సౌజన్య, క్వీన్ విక్టోరియా, ధనలక్ష్మి, నితిజ్ఞ, సుబ్బారావు, శశాంక్, భరత్ రెడ్డి, సంతోష్, అధిత తదితరులు పాల్గొన్నారు.