BREAKING
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బిఆర్ఎస్ పై కాంగ్రెస్ టార్గెట్ నితిన్, మురళీకాంత్ కాంబినేషన్ ‘అలియాస్ రుక్మిణీ’ ప్యాకప్: పది రోజుల తొలి షెడ్యూల్ పూర్తి ‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్ నెక్స్ట్ లెవెల్: విశేషాలు వెల్లడించిన ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ బన్నీ వాస్, సుకుమార్ల 'ఇడుపు కాయితం' నుంచి 'శ్రీలత..' పాటకు విశేష స్పందన: హర్షం వ్యక్తం చేసిన సురేష్ బొబ్బిలి, అలరాజు మండాడి’ చిత్రానికి విచిత్ర ఆదరణ: గ్రాండ్‌గా విజయోత్సవ వేడుక నిర్వహించిన చిత్రబృందం మహేంద్రగిరి వారాహి’కి లభిస్తున్న ఆదరణపై హర్షం: థ్యాంక్స్ మీట్‌లో హీరో సుమంత్, చిత్రబృందం సెప్టెంబర్ 18న ‘సీక్రెట్ సోల్జర్’ విడుదల: ప్రమోషన్లలో ముచ్చటించిన కథానాయకులు నిహాల్, సూర్య శ్రీనివాస్ మధుయాష్కిని కలిసిన ఏఐపీసీ తెలంగాణ ప్రతినిధులు ప్రొఫెషనల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంపై చర్చ బ్రిక్స్ సదస్సులో నరేంద్ర మోదీ, షీ జిన్‌పింగ్ భేటీ: సరిహద్దు, ద్విపాక్షిక సంబంధాలపై సుదీర్ఘ చర్చలు పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సంక్షేమానికి కీలకం – విద్యతో పాటు క్రీడలు, క్రమశిక్షణకు ప్రాధాన్యం – మాదకద్రవ్యాలకు దూరంగా.. బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం డీజీపీ సి.వి. ఆనంద్‌ వెల్లడి విద్యా విజయాలకు మార్గదర్శి.. కదిరి బాబు రంగారావు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై కీలక ప్రకటన! కూటమి అక్రమాలకు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం న్యూఢిల్లీ ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించిన బ్రిక్స్ కూటమి 'విశేషాధికారాల పిరమిడ్' స్థానంలో 'భాగస్వామ్య వేదిక' రావాలి

మహేంద్రగిరి వారాహి’కి లభిస్తున్న ఆదరణపై హర్షం: థ్యాంక్స్ మీట్‌లో హీరో సుమంత్, చిత్రబృందం

Select Suryaa Now
మహేంద్రగిరి వారాహి’కి లభిస్తున్న ఆదరణపై హర్షం: థ్యాంక్స్ మీట్‌లో హీరో సుమంత్, చిత్రబృందం

సూర్యా న్యూస్ డెస్క్

హీరో సుమంత్ నూతన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’ సెప్టెంబర్ 11న విడుదలవై థియేటర్లలో సానుకూల స్పందనను దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సుమంత్, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, ఇతర చిత్రబృందం పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.

ARTICLE:
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కథానాయకుడిగా తెరకెక్కిన డివైన్ థ్రిల్లర్ చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. ఈ సినిమాలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఒక కీలకమైన ప్రత్యేక పాత్రలో నటించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ పతాకాలపై మధు, లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన నాటి నుంచి గ్రౌండ్ లెవెల్‌లో మంచి మౌత్ టాక్ రావడంతో విజయోత్సవ సమావేశాన్ని నిర్మాతలు నిర్వహించారు.

ఈ పాత్రికేయుల సమావేశంలో కథానాయకుడు సుమంత్ మాట్లాడుతూ.. ఈ సినిమాకి క్షేత్రస్థాయి నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని హర్షం వ్యక్తం చేశారు. విడుదలైన తొలి రోజు కాస్త సమయం పట్టినప్పటికీ, క్రమంగా ప్రేక్షకుల మద్దతు పెరిగిందని వివరించారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి మిత్రులు, అభిమానులు ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారని తెలిపారు. చాలా కాలం తర్వాత తన సినిమాకు ఇంతటి సానుకూల స్పందన రావడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని, రాబోయే వారంలో కూడా థియేటర్లలో ఈ హవా కొనసాగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ.. క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే మలుపులను ప్రేక్షకులు ఏ రీతిలో స్వీకరిస్తారోననే ఆందోళన ఉండేదని, అయితే థియేటర్లలో ఆడియన్స్ ఆ అంశాలను ఎంతో బాగా ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు. ప్రదర్శనల సంఖ్యతో పాటు థియేటర్లకు వచ్చే జనం శాతం కూడా వేగంగా పెరుగుతోందని తెలిపారు.

చిత్ర నిర్మాత మధు వివరాలు వెల్లడిస్తూ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కృష్ణా, ఈస్ట్, వైజాగ్, తిరుపతి, నైజాం పరిధిలోని థియేటర్లతో పాటు ఒడిశాలోనూ రెస్పాన్స్ బాగుండడంతో కొత్తగా 75 స్క్రీన్‌లను పెంచినట్లు తెలిపారు. హిందీ వెర్షన్‌లోనూ ఆదరణ పుంజుకుంటోందని చెప్పారు. నటులు వంశీ చాగంటి, మీనాక్షి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.