BREAKING
వ్యూహాత్మక రంగాల్లో దూసుకెళ్తున్న భారత్ ఇ-కామర్స్ నిబంధనలను కఠినతరం చేసిన కేంద్రం అటవీ మదింపు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. 'విత్తన గణపతి'ని పూజిద్దాం: విజయ్ దేవరకొండ పిలుపు బఖిరా సరస్సు అవక్షేపాల అధ్యయనం భారత్ మండపంలో ఘనంగా ఏర్పాట్లు పారిస్ అంతరిక్ష సదస్సు మూడు రోజుల పతనానికి బ్రేక్ బీహార్‌లో వరదల బీభత్సం రేపు బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె* సమ్మిళిత ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దుతున్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 42వ వర్ధంతి ‘సర్దార్ 2’ మూవీ రివ్యూ.. కార్తి స్పై యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా? 15,000 మంది సిబ్బంది 200 పారామిలిటరీ బలగాలతో ఢిల్లీలో భారీ భద్రత నెదర్లాండ్స్‌లో వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తి – ముగ్గురు మృతి

శిశు గృహం, జువైనల్ జస్టిస్ బోర్డు, సఖి కేంద్రాలను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ట్రాన్స్లేట్ ఇంగ్లీష్

Select Suryaa Now
శిశు గృహం, జువైనల్ జస్టిస్ బోర్డు, సఖి కేంద్రాలను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ట్రాన్స్లేట్ ఇంగ్లీష్

శిశు గృహం, జువైనల్ జస్టిస్ బోర్డు, సఖి కేంద్రాలను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి.

పిల్లల సంరక్షణ, భద్రతకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి – బి. సౌజన్య.

సంగారెడ్డి, ; - జాతీయ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి  జి. భవానిచంద్ర ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  బి. సౌజన్య గురువారం సంగారెడ్డిలోని శిశు గృహం, జువైనల్ జస్టిస్ బోర్డు, సఖి కేంద్రాలను సందర్శించారు.శిశు గృహాన్ని సందర్శించిన సందర్భంగా పిల్లల సంరక్షణ, ఆరోగ్యం, భద్రత, విద్య, వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి బాగోగులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. శిశు గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, పిల్లలు క్రమశిక్షణతో ఉండేలా అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని తెలిపారు. పిల్లల సంక్షేమం విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.అనంతరం సఖి కేంద్రాన్ని సందర్శించిన ఆమె, కేంద్రానికి వచ్చే బాధితుల సమస్యలను సానుభూతితో విని, వారికి అవసరమైన న్యాయ, ఇతర సహాయ సహకారాలను అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భార్యాభర్తల మధ్య తలెత్తే కుటుంబ సమస్యలను కౌన్సిలింగ్ ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్క
రించేందుకు కృషి చేయాలని తెలిపారు. బాధితులకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించి, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.జువైనల్ జస్టిస్ బోర్డును సందర్శించి,బాలల హక్కుల పరిరక్షణ, బాల న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. తెలిసీ తెలియక జరిగిన తప్పులు, నేరాల కారణంగా భవిష్యత్తు దెబ్బతినకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని, తిరిగి నేరాలకు పాల్పడకుండా మంచి ప్రవర్తనతో ముందుకు సాగాలని బాలలకు సూచించారు.ఉచిత న్యాయ సహాయం అవసరమైన వారు సంగారెడ్డిలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించడంతో పాటు టోల్‌ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి న్యాయ సహాయం పొందవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  కే. ధనలక్ష్మి, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.