జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనా
రాష్ట్రపతి సచివాలయం ఉత్తర్వులు
శ్రీనగర్:జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) విధులను తాత్కాలికంగా లడఖ్ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా నిర్వర్తించనున్నారు. ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా సెలవులో ఉన్న నేపథ్యంలో ఈ నియామకం చేపట్టినట్లు రాష్ట్రపతి సచివాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఆగస్టు 7, 2020 నుంచి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలు అందిస్తున్న మనోజ్ సిన్హా, ప్రస్తుతం అధికారిక పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లి ఉన్నారు. ఆయన తిరిగి వచ్చే వరకు, వినయ్ కుమార్ సక్సేనా లడఖ్ ఎల్జీగా తన పూర్తి బాధ్యతలను నిర్వహిస్తూనే... అదనంగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తారని అధికారులు వెల్లడించారు.