సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్
మొరాకో తొలి సంయుక్త రక్షణ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: శిక్షణ, సైనిక విన్యాసాలు, శాంతి పరిరక్షణ, సైబర్ భద్రత మరియు రక్షణ రంగా తయారీ వంటి కీలక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించేందుకు భారత్, మొరాకో దేశాలు తమ తొలి సంయుక్త రక్షణ కమిటీ (జేడీసీ) సమావేశాన్ని న్యూఢిల్లీలో నిర్వహించాయి. ఈ సమావేశానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (అంతర్జాతీయ సహకారం) అమితాబ్ ప్రసాద్ మరియు మొరాకో రాయల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ 2వ బ్యూరో చీఫ్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్లా అత్మానీ సంయుక్తంగా సహ-అధ్యక్షత వహించారు.
ఈ పర్యటనలో భాగంగా మొరాకో ప్రతినిధి బృందం భారత రక్షణ పారిశ్రామిక సంస్థలతో సమావేశమై రక్షణ ఉత్పత్తుల సహ-ఉత్పత్తి, జాయింట్ వెంచర్లు, సాంకేతిక బదిలీ మరియు నిర్వహణ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు జరిపింది. 2025 సెప్టెంబర్లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొరాకో పర్యటన సందర్భంగా కుదిరిన చారిత్రాత్మక రక్షణ అవగాహన ఒప్పందం (MoU) ఆధారంగా ఈ సంస్థాగత యంత్రాంగం ఏర్పాటైంది. 2027 నాటికి భారత్-మొరాకో దౌత్య సంబంధాలు 70 ఏళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలో, ఈ సమావేశం ఇరు దేశాల మిలిటరీ మరియు పారిశ్రామిక సహకారానికి కొత్త ఊపునిస్తుందని అధికారులు తెలిపారు.