BREAKING
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆటో రాంప్రసాద్ మాస్ వార్నింగ్.. ‘‘నాతో పెట్టుకోవద్దు’’ అంటూ గట్టి హెచ్చరిక! దీపావళి బరిలో లేడీ సూపర్ స్టార్ ‘మూకుత్తి అమ్మన్-2’.. పండుగ సందడి మరింత క్యూట్! మెట్రో నగరాలకు ఆవల కూడా క్యాన్సర్ సంరక్షణ విస్తరించాలి ప్రధాని మోదీ గుజరాత్, మహారాష్ట్ర పర్యటన.. రూ. 35 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం! సన్న వరి రైతులకు అలర్ట్.. రూ. 500 బోనస్ పొందడానికి సెప్టెంబర్ 10 చివరి గడువు! ఒడిశా అడవుల్లో అరుదైన ఒరంగుటాన్‌ల కలకలం.. భయపెడుతున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ కోణాలు! జోధ్‌పూర్‌లో భారత్, జపాన్ ‘వీర్ గార్డియన్-2026’ వైమానిక విన్యాసాలు సింగిల్ పీస్ డెంటల్ ఇంప్లాంట్‌ను అభివృద్ధి చేసిన నిపుణులు కొలంబోలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఘన స్వాగతం జమ్మూ కాశ్మీర్‌లో కైలాష్ కుండ్ యాత్ర ప్రారంభం జాతీయ ఐక్యతను బలోపేతం చేయడంలో సైనిక్ పాఠశాలల కీలక పాత్ర డ్రోన్, కౌంటర్-డ్రోన్ టెక్నాలజీలను ప్రదర్శించనున్న ఐఏఎఫ్ ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు.. ‘కడలి’ పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: కథానాయిక వైష్ణవి చైతన్య ఎఫ్‌ఆర్‌ఐతో రూ. 5,000 కోట్లకు పైగా సైబర్ మోసాల నివారణ ఆహార ధాన్యాల నిర్వహణ ఆధునీకరణకు డీఎఫ్‌పీడీ, ఎఫ్‌సీఐ ఒప్పందం

మెట్రో నగరాలకు ఆవల కూడా క్యాన్సర్ సంరక్షణ విస్తరించాలి

Select Suryaa Now
మెట్రో నగరాలకు ఆవల కూడా క్యాన్సర్ సంరక్షణ విస్తరించాలి

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
విదిశ: క్యాన్సర్ సంరక్షణ సేవలను కేవలం ప్రధాన మహానగరాలకే పరిమితం చేయకుండా చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని విదిశాలో ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ వైద్య కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘డే-కేర్ క్యాన్సర్ కేంద్రాన్ని’ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లాలతో కలిసి ఆయన ప్రారంభించారు. పెరుగుతున్న క్యాన్సర్ భారాన్ని తగ్గించేందుకు రోగులకు వారి స్వగ్రామాలకు సమీపంలోనే నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అణుశక్తి విభాగం (డీఏఈ), టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) సాంకేతిక సహకారంతో విదిశ కేంద్రంలో దశలవారీగా క్యాన్సర్ సంరక్షణ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ముంబైలోని యాక్ట్రెక్ (ACTREC) ప్రాంగణంలో ప్రత్యేక ఆంకాలజీ శిక్షణ నిచ్చారు. విదిశా మెడికల్ కాలేజీలో అధునాతన రేడియోథెరపీ కేంద్రం (లీనియర్ యాక్సిలరేటర్) ఏర్పాటుతో పాటు, ముందస్తు క్యాన్సర్ గుర్తింపు కోసం ప్రత్యేక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్', క్యాన్సర్ రిజిస్ట్రీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.