చెత్త ఏరుకునే కార్మికులకు 'నమస్తే', 'ఆయుష్మాన్' కార్డుల పంపిణీ
కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) నజఫ్గఢ్ జోన్ పరిధిలోని చెత్త ఏరుకునే కార్మికుల సామాజిక-ఆర్థిక సాధికారత మరియు ఆరోగ్య పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. శుక్రవారం మటియాలాలోని ఎంసీడీ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ముఖ్యఅతిథిగా పాల్గొని పారిశుధ్య కార్మికులకు 'నమస్తే' (NAMASTE) గుర్తింపు కార్డులతో పాటు 'ఆయుష్మాన్ భారత్' ఆరోగ్య కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే మాట్లాడుతూ.. నగరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచడంలో చెత్త ఏరుకునే కార్మికులు అందిస్తున్న సేవలు అపారమైనవని ప్రశంసించారు. దేశ పారిశుధ్యం, ప్రజారోగ్య పరిరక్షణలో వీరి పాత్ర అత్యంత కీలకమని అభివర్ణించారు. కార్మికుల పని వాతావరణాన్ని మెరుగుపరచడంతో పాటు వారికి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందేలా కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నజఫ్గఢ్ జోన్ నుంచి 300 మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు.
చెత్త ఏరుకునేవారు, మురుగునీటి పారుదల మరియు సెప్టిక్ ట్యాంక్ కార్మికులకు అధికారిక గుర్తింపునిచ్చి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం. ప్రమాదకరమైన రీతిలో మానవులే స్వయంగా మురుగు, చెత్తను శుభ్రం చేసే పద్ధతులను పూర్తిగా రద్దు చేసి, ఆధునిక యాంత్రీకరణను ప్రోత్సహించడం. ఆయుష్మాన్ కార్డుల ద్వారా ఉచిత వైద్యం అందించడం, వృత్తిపరమైన శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించడం.