నేడు దౌల్తాబాద్, దుద్యాల్ లో సీఎం పర్యటన
నేడు దౌల్తాబాద్, దుద్యాల్ లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన
పలు అభివృద్ధి పనులను పరిశీలన చేయనున్న సీఎం
దౌల్తాబాద్/దుద్యాల్, మేజర్ న్యూస్ :తెలంగాణ ముఖ్యమంత్రి (సీఎం ) రేవంత్ రెడ్డి నేడు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్, దుద్యాల్ మండలాల్లో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3.10 గంటలకు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గోక పస్లాబాద్ కు చేరుకుని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. 3.50 నుంచి 4 గంటల వరకు దౌల్తాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలిస్తారు.సాయంత్రం 4.30 గంటలకు దుద్యాల్ మండల పరిధిలోని హకీంపేట్కు చేరుకుని ఎడ్యుకేషన్ హబ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.అనంతరం 5.40 నుంచి రాత్రి 9 గంటల వరకు హకీంపేట్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి 9.05 గంటలకు హకీంపేట్ నుంచి కొడంగల్కు బయలుదేరి 9.20 గంటలకు కొడంగల్లోని నివాసానికి చేరుకుని రాత్రి బస చేయనున్నారు.
*పటిష్ట భద్రతా ఏర్పాట్లు*
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం సూచించింది. సీఎం రేవంత్రెడ్డికి ‘Z+’ కేటగిరీ భద్రత ఉన్నందున భద్రత, బందోబస్తు, ఎస్కార్ట్, రవాణా, ప్రోటోకాల్ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.