BREAKING
వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వినాయకచవితి శుభాకాంక్షలు ఎంపీ మాగుంట రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండగ  శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. పరిగి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై భగ్గుమన్న బట్లచందారం రైతులు డీఏపీ సంచిలో రాళ్లు.. ఇసుక రైతు నమ్మకానికి ఇదేనా ప్రతిఫలం అధికారులారా.. మా బాధను అర్థం చేసుకోండి రైతుల ఆవేదన.. ప్రతి ఇంటా.. విఘ్నేశ్వరుని ఆశీస్సులు వల్లూరు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తహసీల్దార్ శ్రీవాణి.. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రభుత్వం అండగా ఉంటుంది భారత్-కజకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ, అధ్యక్షుడు టోకాయెవ్ సమీక్ష హిందీ దివస్ 2026 ఏ సంక్షోభమూ ఒక ప్రాంతానికే పరిమితం కాదు ఐఎన్ఎస్ కులిష్‌కి కంబోడియాలో ఘన స్వాగతం తుంపర్తిలో ఘనంగా శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు.. ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు ఈనెల 21లోగా మద్యం దుకాణాల రెన్యూవల్ రుసుము చెల్లించాలి: ఎక్సైజ్ CI చంద్రమణి సెప్టెంబర్ 18న 'పిఠాపురంలో అలా మొదలైంది' విడుదల.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక ప్రజలందరికి.. వినాయక చవితి శుభాకాంక్షలు గణనాథుని కరుణతో ప్రజలకు సుఖసంతోషాలు ఎస్సై సూర్యనారాయణరెడ్డి..

సెప్టెంబర్ 18న 'పిఠాపురంలో అలా మొదలైంది' విడుదల.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక

Select Suryaa Now
సెప్టెంబర్ 18న 'పిఠాపురంలో అలా మొదలైంది' విడుదల.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక

చంద్ర మహేష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పిఠాపురంలో అలా మొదలైంది' చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సినీ ప్రముఖులు హాజరై సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే సరికొత్త కథాంశంతో వస్తున్న చిత్రం 'పిఠాపురంలో అలా మొదలైంది'. పృథ్వీరాజ్, కేదార్‌ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు చంద్ర మహేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం రాత్రి హైదరాబాద్ వేదికగా ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా విచ్చేసి సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు చంద్ర మహేష్‌తో తనకున్న రెండున్నర దశాబ్దాల అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ మంచి విజయం సాధించాలని సుమన్ ఆకాంక్షించారు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా కనెక్ట్ అవుతారని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశం చూసి నటులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారని, అంతగా భావోద్వేగాలతో సినిమా తెరకెక్కిందని ఆయన తెలిపారు. థియేటర్లకు వెళ్లి మంచి చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.

దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ కోసం తాను మనసు పెట్టి, ప్రాణంగా పని చేశానని తెలిపారు. నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని, అందరి సహకారంతో సినిమా అద్భుతంగా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. విభిన్న నూతన తారలు, అనుభవజ్ఞులైన సీనియర్ నటుల కలయికలో రూపొందిన ఈ చిత్రంపై చిత్ర పరిశ్రమలోనూ ఆసక్తి నెలకొంది. ప్రచార కార్యక్రమాలు ఊపందుకోవడంతో సినిమాపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం అన్ని వర్గాల సినీ అభిమానులను అలరిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.