ఈనెల 21లోగా మద్యం దుకాణాల రెన్యూవల్ రుసుము చెల్లించాలి: ఎక్సైజ్ CI చంద్రమణి
ధర్మవరం:
అనంతపూర్ జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, పుట్టపర్తి జిల్లా ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు ధర్మవరం ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో A4 మద్యం దుకాణాల లైసెన్స్దారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ N. చంద్రమణి మాట్లాడుతూ.. ఓపెన్, రిజర్వేషన్ కేటగిరీల కింద మద్యం దుకాణాల రెన్యూవల్ ఫీజులు, చెల్లించాల్సిన వివరాలపై లైసెన్స్దారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత రుసుమును ప్రభుత్వానికి చెల్లించాలని సూచించారు. సకాలంలో ఫీజు చెల్లించని వారి లైసెన్సులను రద్దు చేస్తామని, ఆ షాపుల స్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి నూతన మద్యం షాపుల టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎక్సైజ్ ఎస్సైలు చాంద్ బాషా, నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు మరియు మద్యం దుకాణాల లైసెన్స్దారులు పాల్గొన్నారు.