BREAKING
ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కోలుకోలేని పాకిస్థాన్.. సర్గోధా రన్‌వే బాగుచేయలేక నానా తంటాలు జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే.. కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు: యజమాని ప్రదీప్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ శ్రీ శనేశ్వర స్వామి ఆలయం – మండపల్లి.. శని దోష నివారణకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సందీప్ కిషన్ సిగ్మా ట్రైలర్ విడుదల.. స్టైలిష్ యాక్షన్‌తో అదరగొట్టిన హీరో తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు వైయస్సార్ కడప జిల్లా బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ పదవికి వారెన్ బఫెట్ గుడ్‌బై చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్. అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ ఎల్‌నినోపై ఉమ్మడి పోరాటం.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం దానం నాగేందర్‌కు హైకోర్టులో షాక్‌... ఎమ్మెల్యేగా అనర్హత వేటు! 2027 ఆస్కార్స్ పోటీలో మరాఠీ చిత్రం ‘గొంధల్’ ది ప్యారడైజ్ లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు.. బెంగళూరు ప్రెస్ మీట్‌లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు

వైయస్సార్ కడప జిల్లా

Select Suryaa Now
వైయస్సార్ కడప జిల్లా

కడప, సెప్టెంబర్ 18:
వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు రూరల్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, సజీవ దహనం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది.
కడప POCSO కోర్టు నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.8,000 జరిమానా విధించింది.
బాధితురాలి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రేమ పేరుతో బాలికను నమ్మించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనంతరం సజీవ దహనం చేసి హత్య చేశాడు.
తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.

కేసు క్రైమ్ నంబర్ 231/2024 కింద నమోదు అయింది.
BNS-2023 సెక్షన్లు 64, 103, 303(2), 238 మరియు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు.

దర్యాప్తు అధికారులు సాంకేతిక ఆధారాలతో నేరం రుజువు చేశారు.
నిందితుడిని 30 గంటల్లోనే అరెస్ట్ చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కోర్టు విచారణ అనంతరం నిందితుడికి కఠిన శిక్ష విధించింది.
మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు.