BREAKING
రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్‌ పార్థివదేహానికి పోలీస్ కమిషనర్ నివాళి వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు భాద్రపద అమావాస్య 2026: శని దోష నివారణకు ప్రసిద్ధ శని ఆలయాలు, తప్పక చేయాల్సిన పరిహారాలు ఇవే స్పామ్ కాల్స్‌ కట్టడికి ట్రాయ్ సంచలన నిర్ణయం.. కఠినతరమైన కొత్త నిబంధనలు అమలు ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కోలుకోలేని పాకిస్థాన్.. సర్గోధా రన్‌వే బాగుచేయలేక నానా తంటాలు జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే.. కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు: యజమాని ప్రదీప్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తా: స్పష్టం చేసిన సీనియర్ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ శ్రీ శనేశ్వర స్వామి ఆలయం – మండపల్లి.. శని దోష నివారణకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సందీప్ కిషన్ సిగ్మా ట్రైలర్ విడుదల.. స్టైలిష్ యాక్షన్‌తో అదరగొట్టిన హీరో తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్ట్.. ఈడీ అదుపులో ప్రధాన నిందితుడు వైయస్సార్ కడప జిల్లా బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ పదవికి వారెన్ బఫెట్ గుడ్‌బై చండూర్ పోలీస్ స్టేషన్‌,సర్కిల్ ఆఫీస్ ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్. అర్చకుల సమస్యలకు పరిష్కార బాట! నెల రోజుల్లో చర్యలు.. వినతులపై దేవాదాయ శాఖ భరోసా అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్. అర్చకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ బి. సుధారాణి హామీ ఇచ్చారు. అనంతపురం నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో గురువ ఎల్‌నినోపై ఉమ్మడి పోరాటం.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే.. కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు: యజమాని ప్రదీప్ రెడ్డి

Select Suryaa Now
జన్వాడ ఫార్మ్ హౌస్ భూమి నాదే.. కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు: యజమాని ప్రదీప్ రెడ్డి

సూర్య తెలంగాణ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన జన్వాడ ఫార్మ్ హౌస్ వివాదంపై దాని యజమాని ప్రదీప్ రెడ్డి స్పష్టతనిచ్చారు. జన్వాడ ఫార్మ్ హౌస్ ఉన్న భూమి పూర్తిగా తన సొంతమని, ఈ భూమితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు ఫార్మ్ హౌస్ పరిశీలనకు వస్తారన్న వార్తల నేపథ్యంలో ప్రదీప్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఈ వ్యాఖ్యలు చేశారు. తామిద్దరం చిన్ననాటి స్నేహితులమని, అందుకే ఈ ఫార్మ్ హౌస్‌ను తాను కేటీఆర్‌కు లీజుకు మాత్రమే ఇచ్చానని ఆయన వెల్లడించారు.

ఈ ఫార్మ్ హౌస్ భూములపై ఎలాంటి వివాదాలు లేవని, ఈ భూములకు లీగల్‌గా పూర్తి క్లియర్ టైటిల్ ఉందని ప్రదీప్ రెడ్డి తేల్చిచెప్పారు. ప్రభుత్వానికి లేదా సంబంధిత అధికారులకు ఏవైనా అనుమానాలు ఉంటే తమకు నోటీసులు జారీ చేసి వివరణ కోరవచ్చని, ప్రభుత్వ అధికారులు ఏ పత్రాలు కోరినా నిబంధనల ప్రకారం సమర్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. అయితే రాజకీయ నేతలు వచ్చి ఒక వ్యక్తిగత ఆస్తిని పరిశీలిస్తామని చెప్పి వివాదం సృష్టించడం సరికాదని ఆయన హితవు పలికారు.

వ్యక్తిగత ఆస్తులను రాజకీయ వేదికలుగా మార్చడం, తద్వారా అనవసర రచ్చ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రదీప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చట్టపరంగా ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని, కానీ అనవసరమైన రాజకీయ లబ్ది కోసం ఆస్తులను వివాదాల్లోకి లాగడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తాజా ప్రకటనతో జన్వాడ ఫార్మ్ హౌస్‌కు సంబంధించిన భూ వివాదంపై మరింత స్పష్టత వచ్చినట్లయింది.