BREAKING
గనుల ఆర్థిక వ్యవస్థ నుంచి ఆలోచనల ఆర్థిక వ్యవస్థ వైపు ఒడిశా: సీఎం కీలక వ్యాఖ్యలు పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం: జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఊరట చర్యలు మరో 3 నెలలు పొడిగించాలని ఎన్‌హెచ్‌బీఎఫ్ వినతి భారత్‌తో సిరీస్‌కు వెస్టిండీస్ జట్లు ప్రకటన: టీ20ల్లోకి కీమో పౌల్ మేనల్లుడు కమిల్ పూరన్.. వన్డేల్లోకి జాన్ కాంప్‌బెల్ రీఎంట్రీ ఢిల్లీ సత్య నికేతన్ భవనం కూలిన ఘటన: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ.. ప్రభుత్వ హాస్టళ్ల కొరతపై తీవ్ర ఆగ్రహం తప్పుడు అత్యాచార కేసులతో బ్లాక్‌మెయిల్: కోల్‌కతాలో డబ్బు వసూలు చేస్తున్న మహిళ అరెస్ట్ బ్యాంకుల 3 రోజుల సమ్మె సైరన్: ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా కేంద్ర ఆర్థిక శాఖ అత్యవసర కార్యాచరణ వికసిత్ భారత్ దిశగా కేంద్ర, రాష్ట్రాల సమష్టి అడుగులు: ముగిసిన ఆర్థిక మంత్రుల రెండు రోజుల ఉన్నత స్థాయి సదస్సు మహారాష్ట్ర మంత్రి బాబాసాహెబ్ పాటిల్‌పై ఆర్బీఐ కొరడా: లాతూర్ డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసన నా కెరీర్ ఇక ముగిసిపోయిందనుకున్నా: ఐఐటీ రూర్కీ వేదికగా నాటి సిక్కిం ఆపరేషన్‌ను గుర్తుచేసుకున్న అజిత్ దోవల్ నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లో కలకలం: పాత ఘర్షణల కేసులో స్వతంత్ర అభ్యర్థి అరెస్ట్ ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ హవా: మూడు స్థానాల్లో ఘన విజయం.. ఉపాధ్యక్షుడిగా స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ ప్రజాస్వామ్యం ఖూనీ కావడం వల్లే ఉప ఎన్నికలు: అధికార పార్టీపై డీఎంకే అధినేత స్టాలిన్ ధ్వజం నిషాద్ పార్టీ చీఫ్‌కు సొంత కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం: ముఖేష్ సహానీ ఘాటు విమర్శలు పంజాబ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ: పురోగతిపై కేంద్ర ఎన్నికల కమిషనర్ సమీక్ష యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో A-1 అరెస్ట్

వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు

Select Suryaa Now
వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు

 

భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలో పాల్గొన్న 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న

 సూర్య కరీంనగర్ ప్రతినిధి 
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ 11వ డివిజన్ రామచంద్రపూర్ కాలనీ రోడ్ నంబర్ 21, 21/4లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న సందర్శించారు. ఈ సందర్భంగా వినాయక స్వామివారికి ప్రత్యేక కుంకుమ పూజ నిర్వహించి, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి వెల్లివిరియాలని కోరుకున్నారు.

అదేవిధంగా వినాయక మండపాల నిర్వాహకులు, కాలనీవాసులు ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తి వాతావరణంలో నిర్వహించుకోవాలని, నిమజ్జనం సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కార్పొరేటర్‌ను మండపానికి ఆహ్వానించిన కాలనీవాసులు, నిర్వాహకులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మండప నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.