BREAKING
కునాల్ ఖేము ‘వైబ్’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ. 2.25 కోట్ల వసూళ్లు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులే శిల్పులు: ఘనంగా బీఎస్ఎంఏటీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం తల్లిదండ్రులైన దీపికా పదుకొనే, రవీర్ సింగ్.. రెండవ కూతురికి స్వాగతం పలికిన స్టార్ కపుల్ రేపు ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి ఉత్తమ్ చొరవతో కోదాడలో కొలువుల జాతర పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్‌కుమార్ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి:నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎంపీ చామల సంచలన ఆరోపణలు కేటీఆర్‌కు చెందిన భూములపై ఈడీ, ఐటీ కేసులు .. ఉండగానే బదలాయింపులు ఎలా జరిగాయి?: ఫిరంగి నాలా ఆక్రమణతోనే ఫామ్‌హౌస్ నిర్మాణం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎంపీ ఆరోపణ కోదాడ జాబ్ మేళా లోఎంపికయినా 50 మంది కిట్స్ విద్యార్థినులు. అక్టోబర్ 9 నాటికి SIR తుది ఓటర్ల జాబితా ప్రచురణకు పకడ్బందీ చర్యలు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తల్లులు, పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి* గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి శాఖల మధ్య సమన్వయంతో సకాలంలో భవనాల నిర్మాణం పూర్తి చేయాలి మంత్రి మంత్రి సీతక్క క్యూర్ ప‌రిధిలో 21వేల డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి ఈనెలాఖరులోగా ల‌బ్దిదారుల ఎంపిక పూర్తిచేయాలి దాదాపు 9వేల మందికి ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు క‌లెక్ట‌ర్ల‌తో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణది కీలక పాత్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎంపీ చామల సంచలన ఆరోపణలు కేటీఆర్‌కు చెందిన భూములపై ఈడీ, ఐటీ కేసులు .. ఉండగానే బదలాయింపులు ఎలా జరిగాయి?: ఫిరంగి నాలా ఆక్రమణతోనే ఫామ్‌హౌస్ నిర్మాణం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎంపీ ఆరోపణ

Select Suryaa Now
జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎంపీ చామల సంచలన ఆరోపణలు కేటీఆర్‌కు చెందిన భూములపై ఈడీ, ఐటీ కేసులు .. ఉండగానే బదలాయింపులు ఎలా జరిగాయి?: ఫిరంగి నాలా ఆక్రమణతోనే ఫామ్‌హౌస్ నిర్మాణం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎంపీ ఆరోపణ

 

తెలంగాణ బ్యూరో ప్రతినిధిః జన్వాడలోని భూములు, ఫామ్‌హౌస్ వ్యవహారంపై భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. జన్వాడ భూముల అంశంపై హైడ్రా కమిషనర్, మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ప్రైవేటు భూముల్లోకి వెళ్లాలనే ఉద్దేశం తమకు లేదని, గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం అధికారాన్ని దుర్వినియోగం చేసిందనే విషయాలను ప్రజలకు వివరించేందుకే వచ్చామని చెప్పారు.
జన్వాడలోని భూములకు సంబంధించి సత్యం రామలింగరాజుకు చెందిన శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరును ప్రస్తావించిన చామల.. ఆ కంపెనీకి సంబంధించిన భూముల బదలాయింపులపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. 301, 311, 313 సర్వే నంబర్లలోని భూములు ఇతరుల పేర్లకు, అనంతరం డీఎన్‌బీ అనే కంపెనీకి బదలాయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో డి.రాజేష్ అనే వ్యక్తి పాత్రపై కూడా ప్రశ్నలు సంధించారు. ఈడీ, ఐటీ కేసులు ఉన్న సమయంలోనే 13 ఎకరాల భూములను ఎలా విడుదల చేశారని చామల ప్రశ్నించారు. ఆ భూములు ప్రదీప్ రెడ్డి పేరుకు ఎలా బదలాయించబడ్డాయో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ, ఈడీ ఈ అంశంపై హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. జన్వాడ ఫామ్‌హౌస్ ఫిరంగి నాలాను ఆక్రమించి నిర్మించారని, 111 జీవో పరిధిలో ఉన్నప్పటికీ నిర్మాణానికి అనుమతులు తీసుకోలేదని చామల ఆరోపించారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నాళా ఆక్రమణకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫామ్‌హౌస్‌లో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ప్రదీప్ రెడ్డికి జూలైలోనే హైడ్రా నోటీసులు ఇచ్చిందని తెలిపారు. 301 సర్వే నంబర్‌లో 3 ఎకరాల 2 గుంటల భూమి కేటీఆర్ సతీమణి శైలిమ పేరుతో, మరో 18 గుంటల భూమి కేటీఆర్ అత్త పాకాల శశిరేఖ పేరుతో ఉందని చామల పేర్కొన్నారు. ఈ భూములు గతంలో సత్యం రామలింగరాజుకు చెందిన కంపెనీ భూములేనని ఆయన ఆరోపించారు. ఐటీ ట్రిబ్యునల్‌లో కేసు కొనసాగుతున్న సమయంలోనే భూముల బదలాయింపు ఎలా జరిగిందని ప్రశ్నించారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రదీప్ రెడ్డిపై డ్రోన్ కేసు పెట్టి జైలుకు పంపారని చామల గుర్తుచేశారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉన్నారని ప్రదీప్ రెడ్డి ఫిర్యాదు చేశారని తెలిపారు. కేటీఆర్, ప్రదీప్ రెడ్డి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ లేదని కూడా పేర్కొన్నారు. నిన్న హరీశ్‌రావు వ్యవహారంపై, ఇవాళ కేటీఆర్ వ్యవహారంపై ప్రజలకు వివరించామని చామల అన్నారు. హరీశ్‌రావు ఇరిగేషన్ భూముల్లో ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ 300 ఎకరాల్లో ఉందని పేర్కొన్నారు. కాగా, సూర్యాపేటలో కమ్యూనిస్టు మాజీ ఎమ్మెల్యే కుటుంబం ఇటీవల ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుందని చామల ప్రస్తావించారు. అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కుటుంబం చేసినట్లు తాము ఆరోపిస్తున్న భూ వ్యవహారాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు.