BREAKING
గాజుల గణపతి ముసుగులో రాక్షస దందా.. జీవీఎంసీ 'జోన్-6'కి కమీషన్ల కక్కుర్తి! పశ్చిమ బెంగాల్‌లో మత విద్వేషాల కుట్ర కేసు: ఏజేయూపీ అధినేత హుమాయున్ కబీర్‌కు పోలీసుల సమన్లు చెస్ ఒలింపియాడ్: భారత్ జోరు.. స్పెయిన్‌పై 3-1 తేడాతో పురుషుల జట్టు ఘన విజయం చిన్న శ్రీను పెద్ద కథే! విదేశాల్లో ఘనంగా ‘సేవా పఖ్వాడా’ పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌లో భారీ ఎన్‌కౌంటర్: 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నంద్యాలలో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా ముగ్గురికి గాయాలు కునాల్ ఖేము ‘వైబ్’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ. 2.25 కోట్ల వసూళ్లు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులే శిల్పులు: ఘనంగా బీఎస్ఎంఏటీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం తల్లిదండ్రులైన దీపికా పదుకొనే, రవీర్ సింగ్.. రెండవ కూతురికి స్వాగతం పలికిన స్టార్ కపుల్ రేపు ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి ఉత్తమ్ చొరవతో కోదాడలో కొలువుల జాతర పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించాలి: జిల్లా వ్యవసాయ అధికారి ఉల్లోజు వినోద్‌కుమార్ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమం

కునాల్ ఖేము ‘వైబ్’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ. 2.25 కోట్ల వసూళ్లు

Select Suryaa Now
కునాల్ ఖేము ‘వైబ్’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ. 2.25 కోట్ల వసూళ్లు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: నటుడు, దర్శకుడు కునాల్ ఖేము తెరకెక్కించిన తాజా చిత్రం 'వైబ్' బాక్సాఫీస్ వద్ద పపర్వాలేని వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా దేశీయ మార్కెట్‌లో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 2.25 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రంలో కునాల్ ఖేముతో పాటు ప్రముఖ నటి ప్రీతి జింటా, స్పర్ష్ శ్రీవాస్తవ, వంశిక ధీర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

కునాల్ ఖేము గతంలో దర్శకత్వం వహించిన 'మడ్గావ్ ఎక్స్‌ప్రెస్' చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1.50 కోట్ల నుంచి రూ. 1.63 కోట్ల మధ్య వసూళ్లను రాబట్టగా, తాజా చిత్రం 'వైబ్' ఆ సంఖ్యను అధిగమించడం విశేషం. సినిమాకు సంబంధించి విడుదలైన ప్రెస్ రిలీజ్ ప్రకారం, ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. విభిన్నమైన కథాంశంతో తెరకెకిన ఈ చిత్రంలో నటీనటుల అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సినిమా విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో రానున్న రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వినోదాత్మక అంశాలతో పాటు విభిన్న పాత్రల ప్రయాణంగా సాగే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని యూనిట్ భావిస్తోంది. బాలీవుడ్ వర్గాల్లోనూ ఈ సినిమా సాధించిన ఓపెనింగ్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.