BREAKING
జన్వాడ ఫామ్‌హౌస్‌పై ఎంపీ చామల సంచలన ఆరోపణలు కేటీఆర్‌కు చెందిన భూములపై ఈడీ, ఐటీ కేసులు .. ఉండగానే బదలాయింపులు ఎలా జరిగాయి?: ఫిరంగి నాలా ఆక్రమణతోనే ఫామ్‌హౌస్ నిర్మాణం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎంపీ ఆరోపణ కోదాడ జాబ్ మేళా లోఎంపికయినా 50 మంది కిట్స్ విద్యార్థినులు. అక్టోబర్ 9 నాటికి SIR తుది ఓటర్ల జాబితా ప్రచురణకు పకడ్బందీ చర్యలు -జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తల్లులు, పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి* గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి శాఖల మధ్య సమన్వయంతో సకాలంలో భవనాల నిర్మాణం పూర్తి చేయాలి మంత్రి మంత్రి సీతక్క క్యూర్ ప‌రిధిలో 21వేల డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి ఈనెలాఖరులోగా ల‌బ్దిదారుల ఎంపిక పూర్తిచేయాలి దాదాపు 9వేల మందికి ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు క‌లెక్ట‌ర్ల‌తో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణది కీలక పాత్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 24న జిల్లా సాఫ్ట్ బాల్ జూనియర్ జిల్లా ఎంపిక పోటీలు మద్యానికి డబ్బులు లేక రైలు కింద పడి వ్యక్తి మృతి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఆసియా క్రీడల ప్రారంభోత్సవం వాతావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలు అందిస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ 51 వేల మందికి నియామక పత్రాలందించిన ప్రధాని మోదీ సెప్టెంబర్ 20న భారత్‌కు బిజీ షెడ్యూల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం కు ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర కృషి చేయాలి....

క్యూర్ ప‌రిధిలో 21వేల డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి ఈనెలాఖరులోగా ల‌బ్దిదారుల ఎంపిక పూర్తిచేయాలి దాదాపు 9వేల మందికి ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు క‌లెక్ట‌ర్ల‌తో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్

Select Suryaa Now
క్యూర్ ప‌రిధిలో 21వేల డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి ఈనెలాఖరులోగా ల‌బ్దిదారుల ఎంపిక పూర్తిచేయాలి దాదాపు 9వేల మందికి ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు క‌లెక్ట‌ర్ల‌తో  మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి   వీడియో కాన్ఫ‌రెన్స్

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి : ‎గ‌త ప్ర‌భుత్వం మొండిగోడ‌ల‌తో అసంపూర్తిగా వ‌దిలేసిన డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  సూచ‌న‌ల మేర‌కు పూర్తి చేస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు.  ఆనాటి ప్ర‌భుత్వం ప్రారంభించి వ‌దిలేసిన ఇళ్ల‌ను మేమెందుకు పూర్తిచేయాల‌న్న‌   భేష‌జాల‌కు పోకుండా  ఒక్క క్యూర్ ప‌రిధిలోని 26 ప్రాంతాల్లో 21వేల డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను పూర్తిచేశామ‌ని ప్ర‌క‌టించారు.  శ‌నివారం నాడు డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ రాష్ట్ర స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యం నుంచి రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ‌ల్‌, హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్లు, హౌసింగ్‌, వాట‌ర్ వ‌ర్క్స్ , విద్యుత్ అధికారుల‌తో హౌసింగ్ సెక్ర‌ట‌రీ విపి గౌత‌మ్‌తో క‌లిసి మంత్రిగారు  వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి   మాట్లాడుతూ పూర్తి చేసిన డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌కు ఈనెల 30వ తేదీలోగా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న   పార‌ద‌ర్శ‌కంగా డ్రా ప‌ద్ద‌తిలో ల‌బ్దిదారుల ఎంపిక పూర్తి చేసి ఆన్‌లైన్ పోర్ట‌ల్‌లో ల‌బ్దిదారుల వివ‌రాల‌ను న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. 2బిహెచ్‌కే ఇళ్లు ఉన్న ప్రాంతానికి 5నుంచి 7 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉన్నవారినే ఎంపిక చేయాల‌ని సూచించారు.   డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాల‌నీల‌లో తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్య స‌దుపాయాల‌పై ప్ర‌త్యేక‌దృష్టి సారించాల‌ని వాట‌ర్ వ‌ర్క్స్ , ఆర్ డ‌బ్ల్యూఎస్ , విద్యుత్ త‌దిత‌ర శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని వ‌చ్చేనెలాఖ‌రు లోగా మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాల‌ని సూచించారు.  అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌లో ఉన్న అన‌ర్హుల‌ను తొల‌గించాల‌ని, ఆ ఇళ్ల‌లో నివ‌సించ‌ని వారికి ఫైన‌ల్ నోటీస్ ఇచ్చి ర‌ద్దు చేయాల‌ని , అంతేగాక నోటీసుల‌కు స్పందించ‌ని వారి ఇళ్ల‌ను ర‌ద్దుచేసి వారి స్ధానంలో అర్హులైన వారిని ఎంపిక చేయాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.   క్యూర్ ప‌రిధిలో ఇంటిస్ధ‌లాలు ఉండి అర్హులైన దాదాపు 9వేల మందికి ఇందిర‌మ్మ ఇళ్ళ‌ను మంజూరు చేస్తున్న‌ట్లు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి    ప్ర‌క‌టించారు.   ఇన్‌ఛార్జి మంత్రులు , స్ధానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని ఇందిర‌మ్మ ఇళ్ల‌కు  ల‌బ్దిదారుల ఎంపిక, మంజూరు ప‌త్రాల‌ను అంద‌జేయాల‌ని అధికారుల‌కు సూచించారు.