ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం
పామూరు, మేజర్ న్యూస్ : వినాయక చవితి పండుగ పర్వదిన సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను శుక్రవారం మండలంలో నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన వాహనాల్లో డీజే మ్యూజిక్ తో పాటు కొన్ని చోట్ల భజంత్రీలతో నిమజ్జన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. యువతి, యువకులు నిమజ్జన కార్యక్రమంలో విగ్రహాల వద్ద డీజే నృత్యాలు బానసంచాలు తో భారీ ఎత్తున పట్టణంలో ఊరేగించారు.బొట్లగూడూరులో వినాయక విగ్రహాలకు నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ వినోద్ కుమార్ ,ఎస్ఐ కట్టా అనూక్ పర్య వేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు.