BREAKING
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా చారిత్రక ఫొటోను ఉపరాష్ట్రపతి సి పి రాదక్రిష్ణకు వివరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు సైబర్ నేరగాళ్ల ఇద్దరు అరెస్ట్ .. రూ.25 లక్షల నగదు స్వాధీనం- ఎస్పీ సునీల్ షోరాన్ ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నాటరాజన్‌తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ తదితరులు హాజరు ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని విశ్వ సంరక్షక మహా గణపతి హోమం ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు.. నిపుణుల కీలక సూచనలు ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ‘ఫౌజీ’ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్‌పై ఆచితూచి అడుగులు రూ. 1.51 కోట్లతో టేక్కే వ్యవసాయ మార్కెట్ యార్డు సమగ్ర అభివృద్ధి: మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వ్యక్తి అనుమానాస్పద మృతి 'ఎల్లమ్మ' చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ సరసన హీరోయిన్‌గా అనంతిక ఖరారు బ్రెయిన్ స్ట్రోక్ నుంచి క్రమంగా కోలుకుంటున్న 'గబ్బర్ సింగ్' నటుడు రమేష్ గిరిజనుల ఆత్మగౌరవానికి కేసీఆర్ నిర్ణయాలు గుర్తులు విజయ్ దేవరకొండ 'రణబాలి' సినిమా షూటింగ్ పై కీలక అప్‌డేట్

సైబర్ నేరగాళ్ల ఇద్దరు అరెస్ట్ .. రూ.25 లక్షల నగదు స్వాధీనం- ఎస్పీ సునీల్ షోరాన్

Select Suryaa Now
సైబర్ నేరగాళ్ల ఇద్దరు అరెస్ట్ .. రూ.25 లక్షల నగదు స్వాధీనం- ఎస్పీ సునీల్ షోరాన్

-ఇన్‌స్టాగ్రామ్‌ వల..రూ.22.80 లక్షలు హాంఫట్‌
-రూ.1.44 కోట్ల లాభం వచ్చిందంటూ బురిడీ
-‘ట్యాక్స్‌’ పేరుతో మరో రూ.25 లక్షలకు ఎర
-APK ఫైల్‌తో మరో మోసం..ఇద్దరు నిందితుల అరెస్ట్
-రూ.25 లక్షల నగదు,4 సెల్‌ఫోన్లు,ల్యాప్‌టాప్‌ స్వాధీనం
....మీడియా సమావేశంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్‌  షోరాన్

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల పరిధిలో నమోదైన రెండు సైబర్ మోసం కేసుల్లో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితుడి ఫోన్‌కు APK ఫైల్ పంపి ఓపెన్ చేయించడంతో ఫోన్‌ను హ్యాక్ చేసి, ఖాతాలో జమ అయిన రూ.5.24 లక్షలను వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

అలాగే ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో నకిలీ యాప్‌లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలను మోసం చేసి, అమాయకుల బ్యాంకు కరెంట్ ఖాతాలను సేకరించి సైబర్ మోసాల సొమ్మును వాటిలోకి బదిలీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

కోవెలకుంట్ల సీఐ పి. హనుమంత నాయక్ ఆధ్వర్యంలో సాంకేతిక దర్యాప్తు చేపట్టి సెప్టెంబర్ 17న ఉదయం 10.30 గంటలకు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి **రూ.25 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్** స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.