andhrapradesh
అనంతపురంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ మైనార్టీల సంక్షేమ కమిటీ
రాష్ట్ర మైనార్టీ శాసనసభ సంక్షేమ కమిటీ అనంతపురం జిల్లాలో పర్యటనకు గురువారం వచ్చింది. ఈ సందర్భంగా నగర శివారులోని ఎస్కే యూనివర్సిటీలో రాష్ట్ర మైనార్టీ శాసనసభ సంక్షేమ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో మైనార్టీలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ వారు సమావేశాన్ని నిర్వహించారు.