రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!!
రేపే ఆదోనిలో గణనాధుని నిమజ్జనం…!!
ఆదోని సూర్య ప్రతినిధి..
ఆదోని పట్టణంలో రేపే గణనాధుని నిమజ్జన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సుమారు 400 విగ్రహాలను నిమజ్జనానికి ఏర్పాట్లు సిద్ధం. అధికారులు సూచించిన మార్గం గుండా విగ్రహాలను తరలించాలని పోలీసులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి నిమజ్జనాన్ని ప్రారంభిస్తామన్నారు. వినాయక మిత్రమండలి నేతలు, భక్తులు, అన్ని వర్గాల ప్రజలు భక్తులు పోలీసులకు సహకరించి, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాన్ని పూర్తి చేయాలన్నారు.