ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని విశ్వ సంరక్షక మహా గణపతి హోమం
నంద్యాల అర్బన్: ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీ కశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బాలాజీ కళ్యాణ మండపంలో విశ్వ సంరక్షక మహా గణపతి హోమం నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కశెట్టి చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు పాల్గొన్నారు. ఆయన పూజల్లో పాల్గొని నరేంద్రమోదీ నిండు నూరేళ్ళు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పసుపుల రవికుమార్, జిల్లా కార్యదర్శి భరత్ కుమార్, జిల్లా కోశాధికారి శివసాయి తదితరులు పాల్గొన్నారు.