పేద ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం- సిపిఐ ప్రసాద్
అమ్మ ఒడి పింఛన్లలో మోసపూరితంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి కె ప్రసాద్
రాష్ట్రవ్యాప్తంగా ఒక కుటుంబ హౌసింగ్ మ్యాప్ లో మరో కుటుంబ సభ్యులు యాడ్ కావడం వలన వారికి కరెంటు బిల్లులు పర్సెంటేజ్ ప్రకారం సంవత్సరానికి 300 యూనిట్లు దాటడం వలన పేద ప్రజలు ఎటువంటి ప్రభుత్వ పథకాలు రాకపోవడం వలన అనేక బాధలు పడుతున్నారు
రాష్ట్ర ప్రభుత్వం ముందు హౌసింగ్ మ్యాప్ లో యాడ్ అయిన రెండు మూడు కుటుంబాలను వేరు చేసే విధంగా ఆప్షన్ విడుదల చేసి న తరువాత అమ్మ ఒడి. పింఛన్లు విడుదల చేసి ఉంటే పేద ప్రజల మన్నలను పొందేవారు
రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా ఖాళీ కాకుండా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేశామని చెప్పుకోవడానికి ఈ రకంగా మోసం చేస్తున్నారు
ఇది ప్రజలు గమనిస్తున్నారు వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతారు
నంద్యాల పట్టణం లో ఇటువంటి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసి పోతున్నారు మున్సిపల్ అధికారులు మీరు చెప్పేటివి వాస్తవమే కానీ వాటిని తొలగించే దానికి ఆప్షన్ ప్రభుత్వం విడుదల చేయలేదు మేము ఏమి చేయాలని చేతులు ఎత్తేస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కల్లా హౌసింగ్ మ్యాపులో యాడ్ అయిన రెండు మూడు కుటుంబాల వారిని తొలగించి ఒకే కుటుంబంలో వారి కుటుంబ సభ్యులు ఉండే విధంగా హౌసింగ్ మ్యాపును విడుదల చేయని పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో అటువంటి బాధితులను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు