BREAKING
స్వచ్ఛ అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దేందుకు బల్క్ వేస్ట్ జనరేటర్లు సహకరించాలి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ప్రైవేట్ హాస్టళ్ల నిర్లక్ష్యం విద్యార్థిని బలి… ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించండి పెనకచర్ల డ్యామ్ కు నీటిని విడుదల చేయాలి పోలవరం ప్రాజెక్ట్ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రి ‘నిమ్మల’ కేజీబీవీ మోడల్ స్కూల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన హరిబాబు హతం… నిజామాబాద్‌లో దారుణ హత్య… ముస్లిం మైనార్టీ సమస్యల పరిష్కారానికి కృషి … ఆయా షేర్ సాంగ్ వచ్చాక లక్ష జడలు అమ్మారు: నేచురల్ స్టార్ నాని విజయ్ దేవరకొండ రణబాలి మూవీ షూటింగ్ పూర్తి.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్ రోగి భద్రతకు పెద్దపీట.: కేర్, ఆస్టర్ ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలు దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార మూవీ రిలీజ్ డేట్ ఖరారు ప్రధాని మోదీకి మెగా హీరో రామ్‌చరణ్ బర్త్‌డే విషెస్‌.. కీలక ప్రకటనతో అభినందనలు టీజీపీసీబీలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం లకుడారం కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నిక

కేజీబీవీ మోడల్ స్కూల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్

Select Suryaa Now
కేజీబీవీ మోడల్ స్కూల్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్

కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్ పనులను పరిశీలించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్

 

భారత ప్రభుత్వ పాఠశాల విద్య, లిటరసీ కార్యదర్శి మరియు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సెప్టెంబర్ 18వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు జగరాజుపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ మరియు కేజీబీవీ  పాఠశాలలను సందర్శించనున్నారు.ఈ నేపథ్యంలో, పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు మరియు ముందస్తు ఏర్పాట్లను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూళ్లలో జరుగుతున్న వివిధ పనులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన కలెక్టర్, అధికారులకు మరియు పాఠశాల ప్రిన్సిపాళ్లకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ అధికారుల రాకను పురస్కరించుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ కార్యదర్శి దేవానందరెడ్డి, సమగ్ర శిక్ష అడిషనల్ ఎస్పీడీ రవీంద్రనాథ్ రెడ్డి, కడప పాఠశాల విద్య ఆర్జేడీ కే. శ్యాముల్, జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణప్ప తదితర అధికారులు పాల్గొన్నారు.