BREAKING
విజయ్ దేవరకొండ రణబాలి మూవీ షూటింగ్ పూర్తి.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్ రోగి భద్రతకు పెద్దపీట.: కేర్, ఆస్టర్ ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలు దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార మూవీ రిలీజ్ డేట్ ఖరారు ప్రధాని మోదీకి మెగా హీరో రామ్‌చరణ్ బర్త్‌డే విషెస్‌.. కీలక ప్రకటనతో అభినందనలు టీజీపీసీబీలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం లకుడారం కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నిక యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ వడ్డన నిజమేనా.. కేంద్రం కీలక ప్రకటన ఇదే భారతీయ సైనిక చరిత్రలో నవ్యా షెకావత్ అరుదైన రికార్డు.. రాష్ట్రపతి ఎయిడ్-డి-క్యాంప్‌గా నియామకం మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ మూవీ విడుదల తేదీ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి భారీ చిత్రం ప్రధాని మోదీ జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి: మహాన్ ఆర్యమన్ సింధియా ప్రత్యేక శుభాకాంక్షలు భారత్‌లో తొలిసారిగా రైతులకు మట్టి కార్బన్ చెల్లింపులు జీ20 సమావేశంలో ఇంధన భద్రతపై భారత్ పిలుపు ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా వారణాసిలో 76 మంది పూజారులతో గంగా హారతి 'సెమీకాన్ ఇండియా 2026'ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఏపీపీఎస్సీ భర్తీ ప్రక్రియ: ఆ పోస్టులకు రాత పరీక్ష తప్పనిసరి

టీజీపీసీబీలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం

Select Suryaa Now
టీజీపీసీబీలో తెలంగాణ ప్రజా పాలనా  దినోత్సవం


తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ), సనత్ నగర్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలనా  దినోత్సవాన్ని గురువారం దేశభక్తి, గౌరవభావంతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ చైర్మన్ శ్రీ రాజశేఖర్ రెడ్డి లక్కాడి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ పోరాటంలో త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. సెప్టెంబర్ 17 చారిత్రక, తెలంగాణ ప్రజలు ప్రదర్శించిన ధైర్యం, సంకల్పం, ఐక్యతను ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ సాధించిన ప్రగతి ప్రజల త్యాగాలు, ఆకాంక్షల ఫలితమని ఆయన పేర్ర్కొన్నారు. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, సహజ వనరులను కాపాడటం ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత అని అన్నారు.
టీజీపీసీబీ అధికారులు, సిబ్బంది అంకితభావం, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ కాలుష్య నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన తెలంగాణను అందించేందుకు సుస్థిర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఐక్యత, సామాజిక బాధ్యత, ప్రజాసేవ విలువలను కాపాడుతూ తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, అదే సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించాలని చైర్మన్ కోరారు.
కార్యక్రమంలో టీజీపీసీబీ సభ్య కార్యదర్శి జి. రవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.