BREAKING
జీ20 సమావేశంలో ఇంధన భద్రతపై భారత్ పిలుపు ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా వారణాసిలో 76 మంది పూజారులతో గంగా హారతి 'సెమీకాన్ ఇండియా 2026'ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఏపీపీఎస్సీ భర్తీ ప్రక్రియ: ఆ పోస్టులకు రాత పరీక్ష తప్పనిసరి సొంతగడ్డపై ఘోర పరాభవం క్రికెటర్ పృథ్వీ షాకు షాక్.. ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్న ఆకృతి అగర్వాల్ ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. రేషన్ డిపోలు, రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే 60 రకాల నిత్యావసరాలు బిగ్ బాస్ హౌస్‌లో ఆసక్తికర పరిణామాలు.. షాలిని ఎలిమినేషన్‌పై వస్తున్న ప్రచారం! తిరుమల బ్రహ్మోత్సవాలు: భక్తుల రద్దీని తగ్గించేందుకు విజయవాడ-తిరుపతి ప్రత్యేక రైలు మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో జోడిగా స్నేహ.. విడుదల తేదీపై మేకర్స్ స్పష్టత నగరంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన పారదర్శక పాలన.. సామాజిక న్యాయం.. సమాన అవకాశాలే ప్రభుత్వ లక్ష్యం మంత్రి వెంకటస్వామి గీతంలో ఘనంగా అంతర్జాతీయ హౌస్ కీపింగ్ వారోత్సవాలు ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం మంత్రి దామోదర్ రాజా నరసింహ స్వచ్ఛతే మన బాధ్యత – పరిశుభ్రతే మన గుర్తింపు*

'సెమీకాన్ ఇండియా 2026'ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

Select Suryaa Now
'సెమీకాన్ ఇండియా 2026'ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ:న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో 'సెమీకాన్ ఇండియా 2026' ఐదవ ఎడిషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ జాతీయ సదస్సు సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణ, అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరియు విధానపరమైన దిశానిర్దేశంపై ప్రధానంగా దృష్టి సారించనుంది.

'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యంతో గత 11 ఏళ్లలో (2014-15 నుండి 2024-25) దేశంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తి రూ. 1.9 లక్షల కోట్ల నుండి ఆరు రెట్లు పెరిగి రూ. 12 లక్షల కోట్లకు చేరగా, ఎగుమతులు రూ. 38,000 కోట్ల నుండి ఎనిమిది రెట్లు పెరిగి రూ. 3.3 లక్షల కోట్లకు చేరాయి. ఇదే సమయంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి రూ. 18,000 కోట్ల నుండి 28 రెట్లు పెరిగి రూ. 5.45 లక్షల కోట్లకు ఎగబాకింది. ప్రత్యేకించి మొబైల్ ఫోన్ల ఎగుమతులు రూ. 1,500 కోట్ల నుండి ఏకంగా 127 రెట్లు పెరిగి రూ. 2 లక్షల కోట్లకు చేరుకోగా, దేశీయ డిమాండ్‌లో దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్ల వాటా 75 శాతం నుండి 0.02 శాతానికి పడిపోయింది. దేశంలో డిజైన్, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్‌లతో కూడిన సంపూర్ణ సెమీకండక్టర్ తయారీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 2022లో 'సెమీకాన్ ఇండియా ప్రోగ్రామ్'ను ప్రారంభించిన విషయం తెలిసిందే.