అర్బన్ టిడిపి కార్యాలయంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు*
*అర్బన్ టిడిపి కార్యాలయంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు*
*కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు*
*దీపాలు వెలిగించి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న నేతలు
అనంతపురం బ్యూరో,
అనంతపురం నగరంలోని అర్బన్ టిడిపి కార్యాలయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, టిడిపి, బిజెపి శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు దీపాలు వెలిగించి ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలను ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా కేక్ కట్ చేసి, ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచ దేశాలకే దిక్సూచిలా నిలిచారన్నారు. గత 12ఏళ్లుగా ఆయన అందిస్తున్న సుస్థిర పాలన, దేశానికి ఆయన చేస్తున్న సేవలు మరే నాయకుడు అందించలేదన్నారు. పేదరిక నిర్మూలన, దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి రంగాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత మోదీ కి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి గతంలో దూసుకెళ్తోంది అని ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, నసీర్ అహ్మద్ పేర్కొన్నారు.