అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
హైదరాబాద్ తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అధికారిక కార్యాలయం ఆదివారం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమైంది. కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న సైతం హాజరై విజయరమణ రావును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.