BREAKING
నాగర్‌కర్నూల్‌లో ఘనంగా ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు నాగర్‌కర్నూల్‌లో ‘మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ’ కార్యాలయం ప్రారంభం ఎమ్మెల్యే సంజీవరెడ్డిని కలిసిన టియుడబ్ల్యుజె (ఐజెయు) నూతన కార్యవర్గం ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు ఫీజు రీయింబర్స్ విడుదల చేయించాలని వినతి మాల కులస్తులకు అన్యాయం చేస్తే ఊరుకోం నారాయణఖేడ్‌లో ‘మజీద్ అమ్మ హాస్పిటల్’ ఘనంగా ప్రారంభం టియుడబ్ల్యుజె (ఐజెయు) మొదటి కార్యవర్గ సమావేశం నాగర్‌కర్నూల్‌లో హత్య కేసు ఛేదన భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి జూనియర్ హాకీ ఆసియా కప్ విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు మడ అడవుల పరిరక్షణకు శాస్త్రీయ విధానం అవసరం రత్నాలు, ఆభరణాల రంగంలో భారత్ ప్రపంచ కేంద్రం తప్పిపోయిన పెంపుడు కుక్క ఆచూకీ చెబితే రూ.7.8 లక్షల నజరానా.. ప్రకటన జారీ చేసిన యజమానురాలు మహిళపై యాసిడ్ దాడి… బిక్కనూర్ మండలంలో ఘటన.. పరిస్థితి విషమం వినాయక చవితి వేళ నిత్య జీవిత పోరాటం.. పండగ సంబరాల వెనుక చిరు వ్యాపారుల కష్టాలు

భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి

నాగర్‌కర్నూల్ కలెక్టర్
నాగర్‌కర్నూల్: జిల్లా ప్రజలందరూ వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్న వినాశకుడైన శ్రీ గణనాథుని కృపాకటాక్షాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో వికసించాలని ఆయన ఆకాంక్షించారు.

మండపాల నిర్వహణలో, పూజల్లో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి పూజించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేవుడిపై భక్తితో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పేర్కొన్నారు.