BREAKING
నాగర్‌కర్నూల్‌లో ఘనంగా ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు నాగర్‌కర్నూల్‌లో ‘మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ’ కార్యాలయం ప్రారంభం ఎమ్మెల్యే సంజీవరెడ్డిని కలిసిన టియుడబ్ల్యుజె (ఐజెయు) నూతన కార్యవర్గం ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు ఫీజు రీయింబర్స్ విడుదల చేయించాలని వినతి మాల కులస్తులకు అన్యాయం చేస్తే ఊరుకోం నారాయణఖేడ్‌లో ‘మజీద్ అమ్మ హాస్పిటల్’ ఘనంగా ప్రారంభం టియుడబ్ల్యుజె (ఐజెయు) మొదటి కార్యవర్గ సమావేశం నాగర్‌కర్నూల్‌లో హత్య కేసు ఛేదన భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి జూనియర్ హాకీ ఆసియా కప్ విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు మడ అడవుల పరిరక్షణకు శాస్త్రీయ విధానం అవసరం రత్నాలు, ఆభరణాల రంగంలో భారత్ ప్రపంచ కేంద్రం తప్పిపోయిన పెంపుడు కుక్క ఆచూకీ చెబితే రూ.7.8 లక్షల నజరానా.. ప్రకటన జారీ చేసిన యజమానురాలు మహిళపై యాసిడ్ దాడి… బిక్కనూర్ మండలంలో ఘటన.. పరిస్థితి విషమం వినాయక చవితి వేళ నిత్య జీవిత పోరాటం.. పండగ సంబరాల వెనుక చిరు వ్యాపారుల కష్టాలు

నాగర్‌కర్నూల్‌లో ‘మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ’ కార్యాలయం ప్రారంభం

Select Suryaa Now
నాగర్‌కర్నూల్‌లో ‘మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ’ కార్యాలయం ప్రారంభం

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్, సబ్ జైలు ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ’ కార్యాలయాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కార్యాలయ భవనంపై జెండాను శ్రీ బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు చింతలగారి వెంకటస్వామితో పాటు సిద్ధేశ్వర్ పటేల్ మరియు వారి కమిటీ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సిద్ధేశ్వర్ పటేల్ మాట్లాడుతూ.. బహుజనులకు రాజ్యాధికారం దక్కకుండా అగ్రవర్ణాలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. బహుజనులంతా ఏకమై ‘ఓట్లు మనవి - సీట్లు మనవి’ అనే నినాదంతో ముందుకు సాగాలని, 12 బహుజన కులాల కూటమితో పోరాడి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకుని నియామక పత్రాలను అందజేశారు. జిల్లా అధ్యక్షురాలిగా వరద్ స్వర్ణలత, ఉపాధ్యక్షురాలిగా నిరడి అంజలి, ప్రధాన కార్యదర్శిగా ఏటిగడ్డ శ్రీనివాసులు, కోశాధికారిగా వారధి నరేందర్, జాయింట్ సెక్రటరీగా జంగిటి సైదులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తీగేల భాస్కర్, పొడుగు రాఘవులు, జాజుల బాలరాజ్, పాలమూరు శంకరయ్య, అల్లిపురం కృష్ణయ్య తదితర నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.