BREAKING
నాగర్‌కర్నూల్‌లో ఘనంగా ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు నాగర్‌కర్నూల్‌లో ‘మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ’ కార్యాలయం ప్రారంభం ఎమ్మెల్యే సంజీవరెడ్డిని కలిసిన టియుడబ్ల్యుజె (ఐజెయు) నూతన కార్యవర్గం ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు ఫీజు రీయింబర్స్ విడుదల చేయించాలని వినతి మాల కులస్తులకు అన్యాయం చేస్తే ఊరుకోం నారాయణఖేడ్‌లో ‘మజీద్ అమ్మ హాస్పిటల్’ ఘనంగా ప్రారంభం టియుడబ్ల్యుజె (ఐజెయు) మొదటి కార్యవర్గ సమావేశం నాగర్‌కర్నూల్‌లో హత్య కేసు ఛేదన భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి జూనియర్ హాకీ ఆసియా కప్ విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు మడ అడవుల పరిరక్షణకు శాస్త్రీయ విధానం అవసరం రత్నాలు, ఆభరణాల రంగంలో భారత్ ప్రపంచ కేంద్రం తప్పిపోయిన పెంపుడు కుక్క ఆచూకీ చెబితే రూ.7.8 లక్షల నజరానా.. ప్రకటన జారీ చేసిన యజమానురాలు మహిళపై యాసిడ్ దాడి… బిక్కనూర్ మండలంలో ఘటన.. పరిస్థితి విషమం వినాయక చవితి వేళ నిత్య జీవిత పోరాటం.. పండగ సంబరాల వెనుక చిరు వ్యాపారుల కష్టాలు

టియుడబ్ల్యుజె (ఐజెయు) మొదటి కార్యవర్గ సమావేశం

Select Suryaa Now
టియుడబ్ల్యుజె (ఐజెయు) మొదటి కార్యవర్గ సమావేశం

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత
నారాయణఖేడ్: స్థానిక కార్తికేయ రెస్టారెంట్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) నూతన కార్యవర్గ సభ్యుల తొలి ఈసీ (EC) సమావేశం జిల్లా యూనియన్ అధ్యక్షుడు ఎండీ ఆసిఫ్ అధ్యక్షతన ఆదివారం ఘనంగా జరిగింది. ఈ భేటీలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై, భవిష్యత్ కార్యచరణ ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంక్షేమానికి మరియు సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

అదేవిధంగా హైదరాబాద్‌లో నిర్వహించిన 'మిస్టర్ తెలంగాణ' పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నారాయణఖేడ్‌కు చెందిన అక్బర్ అలీతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ మచేందర్‌ను యూనియన్ నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు హసీబ్ పటేల్, డివిజన్ అధ్యక్షులు సత్యం, ప్రధాన కార్యదర్శి కే. భూమయ్య, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు బి. రాములు, ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. జావిద్, ఇతర కార్యవర్గ ప్రతినిధులు మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు.