BREAKING
మహిళలు స్వయం ఉపాధిలో ముందుండాలి లి పీ-4 స్ఫూర్తి ...మంత్రి ఫరూక్ చేతుల మీదుగా ఇంటర్ విద్యార్థికి రూ. 20,000 ఆర్థిక సాయం అందజేత జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి* మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరామర్శ కాసేపట్లో విశాఖపట్నం చేరుకోనున్న సీఎం చంద్రబాబు సముద్ర స్వచ్ఛతకు డ్రెయిన్ల ప్రక్షాళనే కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడలో భారీ మెగా జాబ్ మేళా ప్రారంభం అద్భుతమైన చికిత్సతో పసిబిడ్డకు పునర్జన్మ శిశురక్ష ఆసుపత్రి వైద్యులను అభినందించిన జగ్గారెడ్డి. గణిత, గణాంక శాస్త్రంలో ఎం.నాగేష్ కు పీహెచ్.డీ. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల పంటలు ఎండాయి మాజీ మంత్రి శైలజానాథ్ ఎండిపోయిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఒంగోలు ఘన చరిత్రకు ఘనోత్సవం గణపతి మండపాన్ని సందర్శించిన దిల్ రాజు అక్టోబర్‌ 1న కరువు మండలాల ప్రకటన పంటలు లేక.. పనుల కోసం వలస

అద్భుతమైన చికిత్సతో పసిబిడ్డకు పునర్జన్మ శిశురక్ష ఆసుపత్రి వైద్యులను అభినందించిన జగ్గారెడ్డి.

Select Suryaa Now
అద్భుతమైన చికిత్సతో పసిబిడ్డకు పునర్జన్మ  శిశురక్ష ఆసుపత్రి వైద్యులను అభినందించిన జగ్గారెడ్డి.

అద్భుతమైన చికిత్సతో పసిబిడ్డకు పునర్జన్మ

శిశురక్ష ఆసుపత్రి వైద్యులను అభినందించిన జగ్గారెడ్డి.

సంగారెడ్డి: అత్యంత క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితిలో ఉన్న నెలలు నిండకముందే జన్మించిన పసిబిడ్డకు అరుదైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడిన సంగారెడ్డిలోని శిశురక్ష చిన్నారుల ఆసుపత్రి వైద్యులను ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభినందించారు.

కేవలం 980 గ్రాముల బరువుతో జన్మించిన శిశువుకు ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకపోవడంతో పాటు మూత్రపిండాల పనితీరు కూడా దెబ్బతింది. దీంతో శిశువుకు అత్యవసర వైద్య చికిత్స అవసరమైంది. విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి వెంటనే ఆ పసిబిడ్డను సంగారెడ్డిలోని శిశురక్ష చిన్నారుల ఆసుపత్రిలో చేర్పించారు.

వైద్యులు శిశువును శ్వాస యంత్రంపై ఉంచి నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందించారు. మూత్రపిండాల పనితీరు సరిగా లేకపోవడంతో రక్తశుద్ధి చికిత్స కూడా అందించారు. సుమారు 50 రోజుల పాటు వైద్యులు అందించిన చికిత్సతో శిశువు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. ప్రస్తుతం బిడ్డ బరువు 1.6 కిలోలకు చేరుకోవడం విశేషం.

ఆసుపత్రికి వెళ్లి అభినందించిన జగ్గారెడ్డి

శిశువు ఆరోగ్యం మెరుగుపడిన విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పసిబిడ్డను పరామర్శించారు. వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సంగారెడ్డిలోనే అత్యాధునిక వైద్య సేవలు అందించి పసిబిడ్డ ప్రాణాలను కాపాడటం అభినందనీయమని పేర్కొన్నారు.

శిశురక్ష ఆసుపత్రి వైద్యులు ఎంతో జాగ్రత్తగా చికిత్స అందించి పసిబిడ్డను కాపాడటంతో ఆ తల్లిదండ్రుల కుటుంబంలో ఆనందం నిండిందని జగ్గారెడ్డి తెలిపారు.

చికిత్స ఖర్చులో సగం మినహాయింపు

సుమారు 50 రోజుల చికిత్సకు నాలుగు లక్షల రూపాయలకు పైగా ఖర్చు అయినట్లు తెలిపారు. శిశువు తల్లిదండ్రులు సుమారు రెండు లక్షల రూపాయలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని తాను చెల్లిస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నప్పటికీ, ఆసుపత్రి యాజమాన్యం మానవతా దృక్పథంతో చికిత్స ఖర్చులో సగం మొత్తాన్ని మినహాయించినట్లు తెలిపారు.