మూడు తరాలను తెలంగాణలో ముంచిన ముసలి నక్క కాంగ్రెస్: కేటీఆర్
సూర్య కరీంనగర్ ప్రతినిధి::
కరీంనగర్లో జరుగుతున్న విద్యార్థులు, యువత సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ తీరును ప్రస్తావిస్తూ, మూడు తరాల తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.1956లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను ప్రజల అభీష్టానికి విరుద్ధంగా బలవంతంగా కలిపిందని, 1968లో తెలంగాణ ఉద్యమంలో 370 మందిని కాల్చి చంపిందని కేటీఆర్ ఆరోపించారు. 1971లో తెలంగాణ ప్రజలు గెలిపించిన 11 మంది పార్లమెంట్ సభ్యులను కాంగ్రెస్లో కలుపుకుందని విమర్శించారు.
2004లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి, పదేళ్ల పాటు రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేశారని అన్నారు. శ్రీకాంతాచారి వంటి వందలాది మంది ప్రాణత్యాగాలు, కేసీఆర్ నిరాహార దీక్ష తర్వాతే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.