కొడంగల్ లో ఓటుకు కాపలా
ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూడాలి: సీఎం రేవంత్రెడ్డి
కొడంగల్, సెప్టెంబరు 5 (మేజర్ న్యూస్): కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని ఆదరించడం వల్లే నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో కార్యకర్తలు, స్థానిక నాయకులతో సమావేశమైన ఆయన.. ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేదల ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి బూత్లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బీఎల్ఏలతో సమన్వయం చేసుకుని ఓటర్ల జాబితాలను పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి ముఖ్య నాయకుడు నాలుగు గ్రామాల బాధ్యత తీసుకుని పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాలని సూచిస్తూ.. ఓటు హక్కును కాపాడుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దామోదర రాజ నర్సింహా, ఎమ్మెల్సీ దయాకర్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే లు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్. ప్రశాంత్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు, సర్పంచ్ లు, కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.