BREAKING
మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ: విద్యార్థులతో సరదా ముచ్చట్లు డీఆర్డీవోలో రీసెర్చ్ ఉద్యోగాలు తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026: విశేష్ శర్మ సంచలన విజయం ఐటీఆర్ దాఖలుకు అక్టోబర్ 31 వరకు గడువు: వీరికి మాత్రమే వర్తింపు! సన్న వడ్లకు రూ.500 బోనస్: అక్టోబర్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు డీజేలపై పోలీసుల నిఘా: గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక నజర్ ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్

తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026: విశేష్ శర్మ సంచలన విజయం

Select Suryaa Now
తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026: విశేష్ శర్మ సంచలన విజయం

హైదరాబాద్‌లోని ప్రఖ్యాత హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (HGA) వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక 'తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ 2026' టోర్నమెంట్‌లో స్థానిక కుర్రాడు విశేష్ శర్మ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఫైనల్ పోరులో నిబ్బరం ప్రదర్శించిన 19 ఏళ్ల యువ గోల్ఫర్ విశేష్ శర్మ, తన కెరీర్‌లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌ను కైవసం చేసుకుని సంచలనం సృష్టించాడు. సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నమెంట్‌లో హోరాహోరీగా సాగిన పోటీలో చివరి వరకు పట్టుసడలించకుండా ఆడి విజయాలందించి చరిత్ర సృష్టించాడు.  

రూ. 1 కోటి ప్రైజ్ మనీ కలిగిన ఈ టోర్నమెంట్‌లో విశేష్ శర్మ చివరి రౌండ్‌లో 1-అండర్ 69 స్కోరు నమోదు చేశాడు. దీంతో టోర్నమెంట్ మొత్తంగా 21-అండర్ 259 స్కోరుతో నిలిచి, తన సమీప ప్రత్యర్థి అమర్‌దీప్ మాలిక్‌పై ఒక స్ట్రోక్ ఆధిక్యంతో విజేతగా నిలిచాడు. తొలి రోజు నుంచి అద్భుతమైన ఫామ్‌ను కనబరిచిన విశేష్, తన అద్భుత ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ విజయంతో అతనికి రూ. 15 లక్షల ప్రైజ్ మనీ దక్కడంతో పాటు, ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో 25వ స్థానం నుంచి 14వ స్థానానికి ఎగబాకాడు. అంతేకాకుండా ప్రతిష్టాత్మక 'డీపీ వరల్డ్ ఇండియా ఛాంపియన్‌షిప్'లోనూ చోటు సంపాదించుకున్నాడు.  

ఆరంభంలో మంచి ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఒత్తిడిని ఎదుర్కొంటూ విశేష్ ఈ విజయాన్ని సాధించడం విశేషం. ఒకానొక దశలో డబుల్ బోగీ ఎదురైనా, వెంటనే తేరుకుని వరుసబర్డీలతో తన ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. చిన్నతనంలో జూనియర్‌గా గ్యాలరీలో కూర్చుని చూసిన గోల్ఫ్ టోర్నమెంట్‌ అదే కోర్సులో, నేడు తాను స్వయంగా బరిలోకి దిగి ఛాంపియన్‌గా నిలవడం తన జీవితంలో మరువలేని అనుభూతినని విశేష్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విజయంతో తెలుగు రాష్ట్రాల కీర్తి ప్రతిష్టలు గోల్ఫ్ రంగంలో జాతీయ స్థాయిలో మరోసారి మారుమోగాయి.