కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ…
సూర్య కరీంనగర్ ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసనలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ భారీగా ఆటో ర్యాలీ నిర్వహించారు.తెలంగాణ చౌక్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా ఆటో నడిపారు. ర్యాలీ ప్రారంభానికి ముందు సీఎం రేవంత్రెడ్డి చిత్రంతో రూపొందించిన వినూత్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.“నిన్న ఒక జెండా.. నేడు ఇంకో కండువా.. అటు కాంగ్రెస్.. ఇటు టీడీపీ.. ఎటు లాభం ఉంటే అటు జంప్” అనే అర్థం వచ్చేలా రూపొందించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంది. అలాగే ‘ఓటుకు నోటు’ అంశాన్ని ప్రస్తావిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికుల సమస్యలపై తమ గళం వినిపిస్తామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.